కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా షూటింగులో ఆగిపోయిన మరోపక్క బ్యాచిలర్స్ ఒక్కొక్కరు పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. హీరో నిఖిల్ పెళ్లి అయిపోయింది. హీరో నితిన్ మరియు దగ్గుబాటి రానా ఇంకొంతమంది లాక్ డౌన్ టైములో తమ సోల్ మేట్స్ నీ సెట్ చేసుకోవడం జరిగింది. కాగా మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక కి కూడా తాజాగా త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. గుంటూరు ప్రాంతానికి చెందిన జొన్నలగడ్డ చైతన్యతో త్వరలోనే నిహారిక పెళ్లి చేసుకోబోతున్నట్లు… మరికొద్ది రోజుల్లో నిశ్చితార్థం జరుగనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

నిహారిక కి కాబోయే వరుడు జొన్నలగడ్డ చైతన్య తాత మరియు చిరంజీవి తండ్రి వెంకట్ రావు కు మంచి స్నేహం ఉండటంతో ఈ సంబంధం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. స్వయంగా చిరంజీవి ఈ సంబంధాన్ని సెట్ చేసినట్లు కూడా సమాచారం. ఇదిలా ఉండగా పెళ్లయిన తర్వాత నిహారిక మళ్లీ సినిమాలు చేయకూడదని భర్త చైతన్య తరఫున ఇంటి సభ్యులు సంబంధం పెట్టుకోక ముందు కండిషన్ పెట్టినట్లు దానికి నిహారిక చాలా ఆలోచించి చివరాకరికి ఒప్పుకున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.

 

దీంతో ఈ వార్త విని ఇంకా నిహారిక ని వెండితెరపై చూడలేము అన్నమాట అని మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు. మరోపక్క నార్మల్ నెటిజన్లు అప్పుడే కండిషన్స్ పెట్టేశారు అన్నమాట మగపెళ్ళివారు అని కామెంట్ చేస్తున్నారు. నిహారిక కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన పెద్దగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ ట్రై చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడంతో ఇంకా సినిమాలకు నిహారిక గుడ్ బై చెప్పేసినట్లే అని అందరూ భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: