ఈ మద్య టిక్ టాక్ పుణ్యమా అని చిన్నా పెద్దా ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ ఏంటో చూపించుకుంటున్నారు. అదృష్టం ఏంటంటే ఈ టిక్ టాక్ తో బాగా పాపులర్ అయిన వారు బుల్లితెర, వెండితెరపై కూడా చోటు సంపాదిస్తున్నారు. డబ్ స్మాష్ తో చేస్తూ బాగా పాపులర్ అయిన వారు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే టిక్ టాక్ తో మంచి ఎంత ఉందో ప్రమాదాలు కూడా అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. టిక్ టాక్ వల్ల ఎంతో మంది ఔత్సహిక కళాకారులు మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు. ఇక తమిళనాడుకు చెందిన టిక్టాక్ స్టార్ టిక్టాక్ స్టార్ సుబ్బలక్ష్మి అలియాస్ రౌడీ బేబీ ఈ మద్య నానా హంగామ చేసిన విషయం తెలిసిందే. టిక్ టాక్ లో ఆమె ప్రదర్శనలు చూసి సింగపూర్ నుంచి ఆహ్వానం వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆమెకు టికెట్ బుక్ చేసి సకల మర్యాదలతో అక్కడికు రప్పించుకున్నారు. ఆ తర్వాత లాక్ డౌన్ రావడంతో అక్కడే చిక్కుకు పోయింది. ఈ మద్య ఇండియాకు వచ్చి డైరెక్ట్ గా ఎవరికీ కనిపించకుండా తన ఇంటికి చేరుకుంది. ఆమె ఉండేది అద్దె ఇల్లు..అందరికీ కామన్ బాత్ రూమ్ ఉండటంతో పక్కింటి వారు వైద్యాధికారులకు విషయం చెప్పారు. దాంతో ఆమె ఇంటికి చేరుకున్న వైద్యులు, పోలీసులు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. తాజాగా త్రిస్సూర్లోని శబరి నగర్లో నివాసం ఉంటున్న సుబ్బలక్ష్మి తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
వెంటనే గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనకు చెందిన వీడియోను అక్కడి ఓ ప్రైవేట్ ఛానెల్ టెలికాస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆ న్యూస్ను ఇచ్చిన రిపోర్టర్ను హెచ్చరిస్తూ సుబ్బలక్ష్మి ఓ వీడియోను రిలీజ్ చేయగా.. దానిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మానసికంగా ఇబ్బంది పడ్డ రౌడీ బేబి ఆత్మహత్యాయత్నంకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.