బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఎన్నో ఆరోపణలు ప్రస్తుతం తెరమీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో విచారణను అటు పోలీసులు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే స్నేహితులు సన్నిహితులు అనే తేడా లేకుండా అందరినీ విచారిస్తూ స్టేట్మెంట్లు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మానసిక ఒత్తిడికి కారణం ఆర్ధిక సమస్యల లేదా ఇంకేదైనా సమస్యలా అన్న  కోణంలో కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే విచారణలో ఒక్కొక్క విషయం బయట పడుతూ ఉన్న విషయం తెలిసిందే. 

 


 అయితే ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉండేది అంటూ ఆయన మాజీ బిజినెస్ మేనేజర్  పోలీసుల విచారణలో వెల్లడించాడు, 2019 జూలై నుంచి ఏడాది వరకు శృతి సుశాంత్ వద్ద మేనేజర్ గా  పనిచేశారు. సుశాంత్ సింగ్ నెలకు పది లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేవారు  అని విచారణలో  వెల్లడించారు శృతి. తన బాంద్రా అపార్ట్ మెంట్ కు నెలకు 4.5 లక్షల రూపాయలు చెల్లించే వారిని...లోనావాలా  సమీపంగా తీసుకున్న ఫామ్ హౌస్ కి లక్ష రూపాయలు సుశాంత్ అద్దె  చెల్లించేవారు అంటూ విచారణలో వెల్లడించింది. 

 


 అయితే కార్లు బైకులు అంటే సుశాంత్  అమితంగా ఇష్టపడే వారని... అతని వద్ద రేంజ్ రోవర్ కార్... మాస రెటి లాంటి లక్సరీ కార్  తో పాటు బిఎండబ్ల్యూ బైక్ కూడా ఉంది అని చెప్పుకొచ్చారు. అయితే అటు సినిమా పరిశ్రమ నుంచి కూడా మంచి అవకాశాలే ఉన్నాయని.. నాలుగు ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రాజెక్టులు నటనకు సంబంధించిన కోర్సులపైనే ఎక్కువగా సుశాంత్ కి  ఆసక్తి ఉండేది అంటూ వెల్లడించారు. ప్లానెట్ నక్షత్రాలను ఎంతగానో ప్రేమించే సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంట్లో ఒక ప్రత్యేకమైన టెలిస్కోప్ కూడా ఉంది అని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: