కమల హాసన్ కూతురు గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ సౌత్ ఇండస్ట్రీ లో వరుస విజయాలు సాధించి స్టార్ హీరో ఇంకా అతి తక్కువ కాలంలోనే మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఇంకా చాలామంది టాప్ హీరోలతో నటించడం జరిగింది. సౌత్ లో సక్సెస్ సాధించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుని విజయాలు సాధించడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా హాలీవుడ్ ఇండస్ట్రీలో శృతిహాసన్ అవకాశం అందుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు అందుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్  “ట్రెడ్ స్టోన్”లో నటించే అవకాశం దక్కింది. అంతర్జాతీయ వెబ్ సిరీస్ గా రూపొందనున్న “ట్రెడ్ స్టోన్”ని రామిన్ బహ్రానీ తెరకెక్కించనున్నారు. ఢిల్లీలో ఒక హోటల్లో వెయిటర్ గా పని చేస్తూ రహస్యంగా హత్యలు చేసే యువతిగా శృతి నటించనుందని సమాచారం.

 

ఇదే కాకుండా సౌత్ లో కూడా మరికొన్ని సినిమాల్లో శృతిహాసన్ సినిమాలు ఓకే చేయడం జరిగింది. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న 'వకీల్ సాబ్' సినిమాలో కూడా హీరోయిన్ గా ఒప్పుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. దాదాపు ఈ సినిమాలో వారం రోజుల పాటు శృతిహాసన్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.

 

గతంలో పవన్ కళ్యాణ్ శృతి హాసన్ 'గబ్బర్ సింగ్' సినిమా లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. దీంతో మరోసారి శృతి హాసన్ ని నిర్మాత దిల్ రాజు ఓకే చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఏది ఏమైనా సౌత్ ఇండస్ట్రీ లో మరియు బాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక అవకాశాలు అందుకున్న శృతి హాసన్ ఇప్పుడు తాజాగా హాలీవుడ్ ఇండస్ట్రీలో మరో అవకాశం అందుకోవటం ఈ విషయం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: