సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే మూడు వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో తన ఫ్యామిలీ తో కలిసి సరదాగా గడుపుతున్న సూపర్ స్టార్, ఇటీవల తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా తన తదుపరి సినిమా సర్కారు వారి పాట ను ప్రకటించిన విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ 27 వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు యువ దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనుండగా 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించనున్నాయి. 

IHG

యువత సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పరశురామ్, ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తనకు ఒక్కడు సినిమా చూసిన తరువాత సినిమాల్లోకి రావాలనే ఆశ కలిగిందని, ఎప్పటికైనా మంచి దర్శకుడిగా మారాలనే ఆశతోనే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక ల కలయికలో ఆయన తీసిన గీత గోవిందం సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే తనకు కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు ఉన్నప్పటికీ పక్కాగా మాస్ స్టైల్ సినిమా తీసే అవకాశం ఇప్పటివరకు తనకు రాకపోవడంతో తాను మాస్ సినిమాలు తీయలేనంటూ కొందరు తప్పుగా ప్రచారం చేసారని, అయితే అటువంటి వారందరికీ పక్కాగా సమాధానం చెప్పేలా త్వరలోమహేష్ తో తీయబోయే సర్కార్ వారి పాట సినిమాతో సరైన సమాధానం చెప్తానని అన్నట్లు సమాచారం. 

 

ఈ సినిమాలో మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కూడా జోడించడం జరిగిందట. అలానే హీరోయిజం ఎలివేట్ చేసే పలు సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలవనున్నాయని, తప్పకుండా ఈ సినిమా మహేష్ తో పాటు తన కెరీర్ లో కూడా అతి పెద్ద విజయం నమోదు చేయడం ఖాయం అని కొంత ధీమాగా ఉన్నారట పరశురామ్. ఆ విధంగా ఈ సర్కారు వారి పాటతో తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారి ఆట కట్టించనున్నారన్నమాట పరశురామ్. మరి తొలిసారిగా వీరిద్దరి కాంబోలో రానున్న ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: