ప్రభాస్ దిల్ రాథా కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ కథ రీత్యా ఆ మూవీ షూటింగ్ అంతా యూరప్ లోని ఇటలీ ఆస్ట్రియా దేశాలలో జరగవలసి ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా సమస్యలు ఏర్పడటంతో ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ను పూర్తిగా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


భాగ్యనగరంలోని యూరప్ వాతావరణాన్ని తీసుకువచ్చే సెట్స్ నిర్మాణం చేసి ఆసెట్స్ లో ఈమూవీ షూటింగ్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేసారు. వాస్తవానికి ఈ సెట్స్ లో ఈనెలలోనే షూటింగ్ మొదలు కావలసి ఉన్నా ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితులలో ప్రభాస్ ఆగష్టు వరకు తన మూవీ షూటింగ్ ను నిలుపుదల చేసినట్లు లీకులు వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ఈసినిమాకు సంబంధించి సుమారు 5 కోట్ల ఖర్చుతో నిర్మింపబడ్డ హాస్పటల్ సెట్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఒక ప్రవేట్ హాస్పటల్ లుక్ ను పోలిన విధంగా నిర్మింపబడ్డ ఈ భారీ సెట్ లో ఇన్ టెన్సివ్ కేర్ యూనిట్ సెట్ తో పాటు స్పెషల్ వార్డులు జనరల్ వార్డులు డాక్టర్స్ రూమ్స్ ప్రత్యేకంగా కట్టినట్లు తెలుస్తోంది.


బయట నుంచి చూసిన వారికి ఇది ఒక సినిమా సెట్ లా కాకుండా ఒక నిజమైన హాస్పటల్ లా అనిపించే విధంగా ఈ సెట్ ఉంది అని అంటున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే ప్రభాస్ లపై కొన్ని కీలక సన్నివేశాలు ఈ హాస్పటల్ లో తీస్తున్నట్లు టాక్. వాస్తవానికి ఒక ప్రముఖ హాస్పటల్ లో ఈ సన్నివేశాలు ముందుగా తీయాలని భావించిన యూనిట్ వర్గాలు ప్రస్తుత కరోనా సమస్యల రీత్యా నిజమైన హాస్పటల్ లో రోజుల తరబడి షూట్ చేయడం మంచిది కాదు అని ప్రభాస్ భావించిన రీత్యా అతడి సలహా మేరకు ఈ ఆర్టిఫిషియల్ హాస్పటల్ క్రియేట్ చేయబడినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: