రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. టాలీవుడ్‌ సూపర్ హిట్ సినిమా ‘బాహుబలి’ తర్వాత అంతటి విజయం అందిపుచ్చుకున్న సినిమా రంగస్థలం. రంగస్థలం’ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు... కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

 


గ్రామ రాజకీయాలకు అద్దంపట్టే విధంగా రూపొందిన స్క్రిప్టు రంగస్థలం. ఈ కథలో కుటుంబంలో ఉండే విభేదాలు, భావోద్వేగాలు సజీవంగా నిలుపడంలో దర్శకుడు సుకుమార్ సఫలమయ్యాడు. ఈ సినిమా ఈ రోజుతో ఏడాది పూర్తైవుతుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో నటనపరంగా రాని పేరు  ‘రంగస్థలం’ సినిమాతో సంపాదించుకున్నాడు రామ్ చరణ్.

 

 

మరోవైపు అతని నుంచి నటన రాబట్టుకోవడంలో దర్శకుడిగా సుకుమార్ సఫలమయ్యాడు. ఇక డిజిటల్ యుగంలో 1980 నాటి స్టోరీతో గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి జనరేషన్‌కు కొత్తగా అనిపించింది.

 

 

అందుకే ఈసినిమాకు ప్రజలు ఆదరించారు. మరోవైపు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించిన ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్‌, నరేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ‘రంగస్థలం’ మూవీ బాక్సాఫీస్ దగ్గర  రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ‌తో పాటు రూ.115 కోట్ల షేర్ రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.

 


దీంతో దశాబ్దాల తర్వాత కన్నడలో డబ్ అవుతున్న తెలుగు సినిమాగా  ‘రంగస్థలం’ రికార్డు క్రియేట్ చేసింది.  తెలుగులో ‘మాయా బజార్’ తర్వాత మరో సినిమా ఏది కన్నడలో డబ్  కాలేదు. ఇపుడు చాలా ఏళ్ల తర్వాత రంగస్థలం కన్నడ డబ్బింగ్ ‌తో మరో రికార్డును క్రియేట్ చేసింది. పల్లెటూరి నేపథ్యంలో సాగిన ‘రంగస్థలం’ సినిమాకు హీరో రామ్ చరణ్ నటన హైలైట్. రంగస్థలం చిత్రానికి ఆడియోగ్రఫీకి అవార్డు ఆదుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: