టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ అనుష్కతో తెరకెక్కించిన రుద్రమదేవి తర్వాత తన సమయాన్ని పూర్తిగా హిరణ్యకశ్యప సినిమా మీదే పెట్టాడు. రుద్రమదేవి సరైన ఫలితం ఇవ్వకపోయినప్పటికీ, హిరణ్య కశ్యప వంటి భారీ బడ్జెట్ సినిమాని తలెకెత్తుకున్నాడు. రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్ర స్క్రిప్టు పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం గుణశేఖర్సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం.

 

 


సురేష్ ప్రొడక్షన్స్, గుణశేఖర్ కలిసి సంయుక్తంగా నిర్మించాలని అనుకున్న ఈ సినిమాకి భారీ బడ్జెట్ అవసరం. పాన్ ఇండియా రేంజ్ లో బాహుబలి రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఇప్పట్లో తెరకెక్కే అవకాశం కనిపించడం లేదు. కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటోంది. భారీ బడ్జెట్ చిత్రాలకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

IHG

 

కరోనా సృష్టించిన విలయ తాండవం వల్ల చాలా సినిమాలు ఆగిపోతున్నాయి. నిర్మాతలు కోట్లకి కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలని నిర్మించే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందే సినిమాలు పునారాలోచన్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో రానా హిరణ్య కశ్యప సినిమాని మరికొన్ని రోజులు పక్కన పెట్టాలని సురేష్ బాబు భావించాడట. దాంతో గుణశేఖర్ ఆ ప్రాజెక్టు నుండే తప్పుకోవాలని భావించినట్లు సమాచారం.

 

 

దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. సుమారు రెండు సంవత్సరాలకి పైగా స్క్రిప్టు పనులు జరుపుకున్న ఈ చిత్రం నుండి గుణశేఖర్ తప్పుకోవడం ఒక రకంగా షాకే అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఓటీటీలకి డిమాండ్ పెరుగుతున్నందున వెబ్ సిరీస్ ని తీసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: