ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో మెగా నందమూరి అభిమానులు చాలా అసహనంగా ఉన్న సంగతి తెలిసిందే. వాళ్లకు ఈ సినిమా లేట్ అవుతున్న ప్రతీ సారి కూడా ఎక్కడో చెప్పలేని విధంగా కోపం వస్తుంది. సినిమా కోసం ప్రతీ సారి ఎదురు చూడటం అది వాయిదా వేస్తున్నామని చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేయడం తో అభిమానుల్లో అసహనం ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉంది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా విషయంలో రాజమౌళి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కీలక దర్శక నిర్మాతలు కూడా. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో  ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 

 

సినిమా విడుదల ను వాయిదా వేయడం వెనుక  ప్రధాన కారణం సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడమే. ఇక ఇప్పుడు సినిమా నటులు కూడా ఈ సినిమా షూటింగ్ కోసం వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. దీనిపై ఇప్పుడు అసహనం ఉంది ఫాన్స్  లో కూడా. ఇంత పెద్ద సినిమాకు అంత కేర్ లెస్ గా ఏ విధంగా ఉంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్. మరి కరోనా ఉంది కదా మేము ఏమి చెయ్యాలి అంటూ సినిమా యూనిట్ కూడా ఇప్పుడు కాస్త అసహనంగానే ఉంది. హీరోయిన్ లు ఒకరు ముంబై లో ఉన్నారు మరొకరు అమెరికాలో ఉన్నారు. 

 

ఒలివియా మోరిస్ అమెరికా నుంచి వచ్చే అవకాశం లేదు. ఇక ఇప్పుడు ఆలియా భట్ కూడా ముంబై నుంచి వచ్చే అవకాశం లేదు. ఆమె ఉన్న ప్రాంతంలో కరోనా తీవ్రంగా ఉంది. అందుకే ఆమె ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇదే విషయాన్ని రాజమౌళి కి ఫోన్ చేసి ఆమె చెప్పింది అని సమాచారం. జక్కన్న కూడా వెయిట్ చేద్దామని చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: