సర్కారు వారి పాట సినిమా విషయంలో మహేష్ బాబు చాలా వరకు జాగ్రత్త పడుతున్నాడు అనే వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా విషయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ ని కూడా భారీగా తగ్గించే అవకాశం ఉంది అనే ప్రచారం సోషల్ మీడియాలో బాగానే జరుగుతూ వస్తుంది. ఇక  ఇంకో వార్త ఏంటీ అంటే ఈ సినిమాలో కొంత మంది నటులను మహేష్ బాబు వద్దు అని చెప్పాడు అని సమాచారం. 

 

అది ఏంటీ అంటే... ఈ సినిమాలో ఇతర భాషలకు చెందిన కొంత మంది నటులను తీసుకున్నారు. ఇప్పుడు వారు అందరిని మహేష్ బాబు వద్దు అని చెప్పాడు అని టాలీవుడ్ లో టాక్ ఎక్కువగా వినపడుతుంది. సినిమా బడ్జెట్ ని తగ్గించుకునే పనిలో భాగంగానే తన పారితోషికం తగ్గించాడు అని హీరోయిన్ పారితోషికం కూడా తగ్గించాడు అని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అనేది చూడాలి. ఈ సినిమాలో ఎక్కువ డిమాండ్ చేసిన హీరోయిన్ ని పక్కన పెట్టే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

సినిమా విషయంలో దర్శకుడ్ని కూడా యాక్షన్ సన్నివేశాలు లేకుండా కథ ను ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా చూడాలి అని కథ ఆధారంగా సినిమా చెయ్యాలి గాని యాక్షన్ సన్నివేశాలు అసలు వద్దు అని చెప్పాడు అని సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాతః ఆ సినిమాను  మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: