సూపర్ స్టార్ మహేష్ బిజినెస్ మెన్ సినిమాలో ముంబైని ఉ..పోయించడానికి వచ్చానని అంటాడు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో పోకిరి తర్వాత భీభత్సమైన అంచనాలతో వచ్చిన సినిమా బిజినెస్ మెన్. తక్కువరోజుల్లో తీసి ఎక్కువ లాభాలు తెచ్చిన ఈ సినిమాలో మహేష్ సినిమా మొత్తం సీరియస్ గా కనిపించి అలరించాడు. ఇక చివర్లో మహేష్ చేత పూరి చెప్పించిన డైలాగ్స్ అయితే కేక పెట్టించాయి. ఇప్పటికి నీ టార్గెట్ 10 అయితే ఎయిం ఫర్ ఎలెవెంత్ మైల్ అనే డైలాగ్ దుమ్ముదులిపేస్తుంది.

 

ఇక రెండు సూపర్ హిట్లు పడ్డ తర్వాత మహేష్, పూరి కాంబోలో రాబోయే హ్యాట్రిక్ మూవీ గురించి ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. జనగణమన టైటిల్ తో మహేష్ తో పోస్టర్ సినిమా భారీగా ప్లాన్ చేశాడు పూరి జగన్నథ్. అయితే టెంపర్ తర్వాత నుండి పూరి ఫ్లాపుల్లో ఉండటం ఇక మళ్లీ పూరికి ఛాన్స్ ఇచ్చి కెరియర్ రిస్క్ లో పడేయలేను అని మహేష్ ఆలోచించడం లాంటివి జరిగి.. వాళ్ల కాంబో అలా ఆగిపోయింది. ఇక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం కష్టమని భావించారు.

 

మొన్నామధ్య మహేష్ కేవలం హిట్టు డైరక్టర్స్ కే ఛాన్స్ ఇస్తానని అనడంతో జనగణమన ఇక వేరే హీరోతోనే అనుకున్నారు. కాకపోతే పూరి అన్న మాటలని పట్టించుకోని మహేష్ ఫ్యాన్స్ చాట్ లో పూరితో సినిమా గురించి తాను ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. మహేష్ అలా చెప్పడంతో మళ్లీ వీళ్ల కాంబో సినిమా ఉంటుందని ఆశలు ఏర్పడ్డాయి. అనుకున్నట్టుగానే పూరి జనగణమన మహేష్ తోనే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారట. అదే జరిగితే బిజినెస్ మెన్ లో చెప్పినట్టు డైలాగ్ చెప్పాలంటే బాలీవుడ్ ను షేక్ చేయాలని పూరి, మహేష్ ఫిక్స్ అయినట్టు చెప్పొచ్చు.. వాళ్లు ఒక్కసారి కమిటైతే బ్లైండ్ గా వెళ్లిపోతారని తెలిసిందే కదా. అప్పుడు అక్కడ కథను మాత్రమే ముంబై తీసుకెళ్లిన పూరి ఈసారి జనగణమన సినిమాను కూడా అక్కడ రిలీజ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా సంచలనానికి బాలీవుడ్ షేక్ అవడం ఖాయమని మాత్రం చెప్పొచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి: