టాలీవుడ్ లో తక్కువ కాలంలో పాపులర్ అయింది నివేదా థామస్. పాపకు చాలా మంచి పేరు చాలా తక్కువ కాలంలోనే వచ్చింది అనే సంగతి తెలిసిందే. చాలా వరకు కూడా ఆమె సినిమాల్లో మంచి ఆఫర్లు కొట్టేసింది. అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు చాల మంచి ఆఫర్లు వచ్చాయి. ఎన్టీఆర్ తో కూడా ఆమె సినిమా చేసింది. అయితే చదువు కోసం అని ఆమె సినిమాలకు కాస్త కొన్ని రోజులు దూరం జరిగింది అని చెప్పవచ్చు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. 

 

అది ఏంటీ అంటే ఆమెకు తారక్ మంచి ఆఫర్ ఇచ్చాడు అని అంటున్నారు. తాను ఒక ఛానల్ పెడుతున్నాడు. యువ అనే ఛానల్ కి తన భార్యను ఎండీ గా చేస్తున్నాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇక ఆ ఛానల్ లో ఒక షో చెయ్యాలి అని ఆమెకు ఆఫర్ ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి. నిజం ఎంత అనేది తెలియదు గాని ఆమెకు ఆఫర్ ఇచ్చాడు అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఆమెకు ఇవడానికి మరో కారణం కూడా ఉంది అని సమాచారం. ఈ ఛానల్ ని మూడు దక్షినాది భాషల్లో తీసుకొచ్చే ఆలోచనలో తారక్ ఉన్నాడు. 

 

అందుకే ఆమెకు ఈ ఆఫర్ ఇచ్చాడు అనే వార్తలు టాలీవుడ్ లో వినపడుతున్నాయి. ఇక తారక్ నుంచి ఫోన్ రాగానే ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది అని సమాచారం. ఇప్పుడు దీని గురించే పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ ఛానల్ ని ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది చూడాలి. దీనిపై టాలీవుడ్ లో కూడా పెద్ద చర్చలు  జరుగుతున్నాయి. లక్ష్మీ ప్రణతి ఆ ఏర్పట్లు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: