ఇప్పుడు మన తెలుగులో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ పూజ హెగ్డే.. పాప కోసం దర్శక నిర్మాతలు డేట్స్ ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఆమె కూడా చాలా వరకు మన తెలుగు మీద బాగానే ఫోకస్ చేసింది. ఇక తమిళ సినిమాలో వరుస అవకాశాలు వస్తున్నా సరే ఆమె మాత్రం మన తెలుగు లో మాత్రమే సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తుంది. ఇక బాలీవుడ్ లో కూడా ఆమెకు చాలా మంచి ఆఫర్లు వస్తున్నా సరే ఆమె మాత్రం ఇక్కడే సినిమాలు చెయ్యాలి అని చూస్తుంది అనే ప్రచారం టాలీవుడ్ లో బాగానే జరుగుతుంది. 

 

ఇక ఇప్పుడు ఒక వార్త ఏంటీ అంటే... ఆమె ఒక వెబ్ సీరీస్ ని మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి చెయ్యాలి అని ప్లాన్ చేస్తుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆసీరీస్  కోసం గానూ ఆమె ఇప్పటికే ఒక కథను కూడా వరుణ్ కి పంపింది అని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన దాని టైటిల్ ని కూడా విడుదల చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఎప్పుడు ఈ సీరీస్ వస్తుంది అనేది చూడాలి. ఇక ఇదిలా ఉంటే ఆమె తెలుగు లో సినిమాలను మాత్రమే చేయడానికి ప్రధాన కారణం ఇక్కడి స్టార్ హీరోలు అని అంటున్నారు. 

 

అవును ఇక్కడి స్టార్ హీరోల కారణంగానే ఆమె ఇక్కడే సినిమాలు చెయ్యాలి అని చూస్తుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు ఇప్పుడు. దానికి కారణం ఏంటీ అంటే... ఆమె బాలీవుడ్ మీద, తమిళం మీద ఫోకస్ చేసి తెలుగు ని లైట్ తీసుకుంది అని దాని తో ఇక్కడి హీరోలకు ఒళ్ళు మండి చేస్తే ఎక్కడో ఒక చోట చెయ్యాలి అని వార్నింగ్ ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: