ఇప్పుడు బాలీవుడ్ లో యువరాజ్ బయోపిక్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని జనాలు కాస్త ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యువరాజ్ ఫాన్స్ అయితే ఈ సినిమా కోసం ఎక్కువగానే  ఎదురు చూస్తూ ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు నిర్మాతగా విరాట్ కోహ్లీ, అతని భార్య ఉండే అవకాశం ఉంది అనే టాక్ వినపడుతుంది. ఆమెకు యువరాజ్ అంటే ముందు నుంచి కూడా అభిమానం ఎక్కువ. అలాగే ఆమెకు సమీరా రెడ్డికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. 

 

సమీరా రెడ్డి ఇటీవల్ ఈ సినిమాను తీయడానికి గానూ ప్రయత్నాలు చేస్తుంది అనే విషయం తెలుసుకున్న వెంటనే తాను నిర్మిస్తా అని అనుష్క ముందుకి వచ్చింది అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. మరి అది ఎంత వరకు నిజం అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో యువరాజ్ పాత్రకు గానూ ఎవరిని తీసుకుంటారా అనే చర్చ బాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగానే జరుగుతుంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ ని తీసుకోవాలి అని భావించినా సరే అతను ఖాళీ గా లేడు అని అదుకే మరో హీరో ని ఎంపిక చేసే అవకాశం ఉంది అనే ప్రచారం మాత్రం బాగా జరుగుతుంది. 

 

ఇక ఈ సినిమాలో యువరాజ్ పాత్రకు గానూ అతని సోదరుడు ఒకరు ఉన్నారు అని ఆయనను అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని బాలీవుడ్ జనాలు అంటున్నారు మరి.  ఎవరిని తీసుకుంటారు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూడాలి. ఇప్పటికే కథ కూడా దాదాపుగా సిద్దమైంది అని సమాచారం. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: