తెలుగు లో కీర్తి సురేష్ కి మంచి పేరు వచ్చింది. అదే విధంగా తమిళం లో కూడా ఆమెకు మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ ఆమె కెరీర్ లో ఇప్పుడు పీక్ స్టేజి లో ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కీర్తి గతంలో సోషల్ మీడియాలో  యాక్టివ్ గా ఉండేది కాదు. కాని ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా కనపడుతుంది. సోషల్ మీడియాల్ ప్రతీ ఒక్క పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది ఆమె. ఇక ఆమె ఫాన్స్ కూడా ఈ పరిణామం చూసి షాక్ అవుతున్నారు. 

 

ఎందుకు ఆమె సోషల్ మీడియా లో ఈ స్థాయిలో యాక్టివ్ గా ఉంది అంటే ఆమె సినిమాలు ఇప్పుడు మూడు... వరుసగా ఓటీటీ లో విడుదల చేయడానికి గానూ ప్లాన్ చేస్తుంది అని సమాచారం. ఇప్పటికే ఒక సినిమాను విడుదల చేసింది ఆమె. ఇక ఇతర సినిమాలను కూడా అదే విధంగా ఓటీటీ లో విడుదల చేసే ఆలోచనలో కీర్తి ఉంది అని అందుకే ఆమె సోషల్ మీడియా మీద అంతగా ఫోకస్ చేసింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. గతంలో ఆమె నెలకి ఒక పోస్ట్ చేయడం కూడా చాలా ఘనం గా  ఉండేది. కాని ఇప్పుడు ప్రతీ రోజు ఆమె సోషల్ మీడియాలో కనపడుతుంది. 

 

ఇప్పుడు ఆమె మన తెలుగు లో మహేష్ తో ఒక సినిమా చేస్తుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది అని టాక్. ఆమె నటిస్తున్న రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది రానున్నాయి. ఇక మిస్ ఇండియా సినిమాను ఓటీటీ లోవిడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: