టాలీవుడ్ లో కొందరు హీరోయిన్ లు అలా వచ్చి ఇలా కనుమరుగు అయిపోయారు. కొన్నాళ్ళు సినిమాల్లో కనపడి ఆ తర్వాత ఒక సినిమాలో కూడా నటించకుండా సినిమాలకు దాదాపుగా దూరంగా ఉన్నారు. వారిలో యువ హీరోయిన్ లు కొందరు ఉన్నారు. వారికి అవకాశాలు వచ్చినా సరే వారు మాత్రం ఇప్పుడు సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు అనే ప్రచారం జరుగుతుంది. ఏదో ఒకటి రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చి  మళ్ళీ తమను ఇబ్బంది పెడతారు అనే భావన లో ఉన్న హీరోయిన్ లు సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు అనే ప్రచారం జరుగుతుంది. 

 

ఇటీవల మహేష్ సరసన నటించిన ఒక హీరోయిన్ ని ఇదే విధంగా వెళ్లి అడిగితే ఆమె చేయలేను అని చెప్పారు అని సమాచారం. ఆమె ఎవరో కాదు అతిధి సినిమాలో హీరోయిన్ గా నటించిన అమృతా రావు. ఆమెకు మంచి అవకాశాలు అప్పట్లో వచ్చినా సరే ఆమె స్కిన్ షో చేయడం ఇష్టం లేక సినిమాలకు దూరం అయ్యారు అని చెప్తారు. ఇప్పుడు మరోసారి ఆమెను దర్శక నిర్మాతలు సినిమా కోసం అడుగుతూ వస్తున్నారు అని అంటున్నారు. అయితే అది హీరోయిన్ పాత్రకు కాదు అని మహేష్ కి చెల్లి గా అని సమాచారం. 

 

సర్కారు వారి పాట లో మహేష్ బాబు కి చెల్లి గా ఆమెను తీసుకునే అవకాశం ఉంది అనే  ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే ఆమె మాత్రం అందుకు నో  అని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. కారణం అదే అని అందుకే ఆమె చేయడం లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఆమె ఢిల్లీ లో నివాసం ఉంటున్నారు. అక్కడే ఆమె వ్యాపారాలు కూడా చేసుకుంటూ బిజీ గా ఉంటున్నారు అని టాక్. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: