పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో నటిస్తున్న 27 వ సినిమా 'సర్కారు వారి పాట'. జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్ధిక నేరస్తుడుగా కనిపించబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయట.

 

7 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు థమన్ కాంబినేషన్ కావడంతో ఖచ్చితంగా సూపర్ హిట్ ఆల్బం ఇవ్వాలని థమన్ కసితో కొత్తరకమైన ట్యూన్స్ ని కంపోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వస్తున్నప్పటికి మహేష్ బాబు సతీమణి నమ్రత కి అత్యంత సన్నిహుతురాలైన సాయి మంజ్రేకర్ నటిస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

 

ఇక ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 400 కోట్ల భారీ బడ్జెత్ తో తెరకెక్కిస్తున్న సినిమా 'రౌద్రం రణం రుధిరం'. ఎన్.టి.ఆర్, రాం చరణ్, ఆలియా భట్, ఓలియా మోరెస్, అజయ్ దేవగణ్ తో సహా కొందరు హాలీవుడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. భారీ కాన్వాయిస్ తో రూపొందుతున్న ఈ సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ చేయాల్సింది. కాని వీ.ఎఫ్.ఎక్స్ వర్క్స్...గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటంతో వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ చేయాలని డేట్ తో సహా అధికారకంగా ప్రకటించారు. మరి తాజా పరిణామాలు చూస్తుంటే ఆ డేట్ కి ఆర్.ఆర్.ఆర్ రావడం అసాధ్యం అని అంటున్నారు.

అయితే మహేష్ బాబు సర్కారు వారి పాట రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ సినిమాని డా.కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తారు. ఇదే మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ తర్వాత ఏ దర్శకుడితోనైనా సినిమా చేస్తాడని సమాచారం. ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ లో సినిమా అనుకొని పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. కాని ఈసారి మాత్రం మిస్సయ్యో ఛాన్సే లేదు ..ఇంకోటి కమిటయ్యో ప్రసక్తే లేదని మేకర్స్ కి భరోసా ఇచ్చాడట మహేష్. 

మరింత సమాచారం తెలుసుకోండి: