రాజా ది గ్రేట్ తర్వాత హిట్టు కోసం తపిస్తున్న మాస్ మహరాజ్ రవితేజ సినిమాలైతే చేస్తున్నాడు కాని అందుకు తగిన ఫలితాలను మాత్రం అందుకోవట్లేదు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్న రవితేజసినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. వీర తర్వాత రవితేజతో చేస్తున్న ఈ సినిమాకు ఖిలాడి టైటిల్ పరిశీలణలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత అయ్యప్పనుం కోషియం రీమేక్ లో రవితేజ నటిస్తాడని అన్నారు. కాని ఆ సినిమా చేసేందుకు రవితేజ అంతగా ఇంట్రెస్ట్ చూపట్లేదని టాక్.

 

సినిమాలో రవితేజతో పాటుగా రానా కూడా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఈ రీమేక్ ను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ అయ్యప్పనుం కోషియం రీమేక్ తెలుగులో నిర్మిస్తున్నారట. రవితేజ, రానా కలిసి సినిమా చేస్తే మాత్రం ఆ సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చినట్టే. అయితే రవితేజ, రానాలు డేట్స్ భారీ మొత్తంలో కావాల్సి ఉండగా రవితేజ అందుకు రెడీగా లేడని అంటున్నారు. 

 

అంతేకాదు ఇద్దరు స్టార్స్ నటించే సినిమా కాబట్టి కొంత రెమ్యునరేషన్ కూడా తగ్గించుకోవాలని అన్నారట. కాని రవితేజ అందుకు నో చెప్పినట్టు అంటున్నారు. సో చూస్తుంటే అయ్యప్పనుం కోషియం సినిమా కేవలం వార్తల్లో మాత్రమే నిలిచేలా ఉంది. మర్ ఈ రీమేక్ ఎప్పుడు చేస్తారు.. ఎవరెవరు అందులో నటిస్తారు అన్న విషయాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. క్రాక్ టీజర్ తో మెప్పించిన రవితేజ ఆ సినిమాను హిట్ టార్గెట్ తో తెరకెక్కిస్తున్నారు. మరి ఆ సినిమా అయినా రవితేజ ఆశలు ఫలించేలా చేస్తుందో లేదో చూడాలి.                       

 

మరింత సమాచారం తెలుసుకోండి: