టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డీజే దువ్వాడ జగన్నాథం. 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ బుల్లితెరపై అలానే యూట్యూబ్ లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడం జరిగింది. ఇకపోతే నేడు ఈ సినిమా రిలీజ్ అయి నేటితో సరిగ్గా మూడేళ్లు గడిచిన సందర్భంగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్ తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. 

IHG's 'Duvvada Jagannadham' working stills ...

అయితే ఈ సినిమా అనంతరం వీరిద్దరూ కలిసి మరొక సినిమా చేస్తున్నారు అనే వార్త ఒకటి నేటి ఉదయం నుండి ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి డీజే సినిమాని తీసిన దిల్ రాజు, ఆ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడంతో మరొక్కసారి వీరిద్దరి కాంబోలో సినిమా చేయాలని అప్పట్లోనే ఫిక్స్ అయ్యారట. అయితే అది ఇప్పటివరకు కుదరలేదని, కాగా నేడు డీజే రిలీజ్ అయి మూడేళ్లు గడుస్తున్న సందర్భంగా బన్నీ కోసం హరీష్ ని ప్రత్యేకంగా ఒక స్టోరీ రెడీ చేయమని చెప్పిన రాజు, అతి త్వరలో అన్ని సిద్ధం అయ్యాక దానిని నిర్మించనున్నారని అంటున్నారు. మరోవైపు అతి త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తన నెక్స్ట్ సినిమా తీయనున్న హరీష్, దానితోపాటు మరొక స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పారు. 

 

కాగా ఆ స్క్రిప్ట్ అల్లు అర్జున్ కోసం అని సమాచారం. అన్ని కుదిరితే మంచి ముహూర్తం చూసుకుని హీరో అల్లు అర్జున్ ని దర్శకుడు హరీష్ కలిసి కథను విన్పించే అవకాశం ఉందని, అలానే దిల్ రాజును కూడా కలిసి ఈ ప్రాజక్ట్ ను పట్టాలెక్కించడం ఖాయం అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా అనంతరం హరీష్ ఇదే ప్రాజక్ట్ ని చేసే ఛాన్స్ కూడా ఉందట. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం, వీరిద్దరి కాంబోలో డీజేని మించేలా మరొక మూవీ రావడం ఖాయం అని అంటున్నారు సినీ ప్రేక్షకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: