ఈ మద్య బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో తనదైన కొరియో గ్రఫితో ఎంతో మంది నటీనటులకు హిట్ సాంగ్స్ అందించిన ప్రముఖ బాలీవుడ్ వెటరన్ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం నుంచి ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు బాంద్రాలోని గురునానక్ ఆస్పతిలో చేర్పించారు. శ్వాస సంబంధింద సమస్యలతో బాధపడుతున్న సరోజ్ ఖాన్కు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటీవ్గా తేలింది. ఆమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రెండు మూడు రోజుల అబ్జర్వేషన్ అనంతరం డిశ్చార్జ్ చేయనున్నట్టు చెప్పారు. 1980-90 దశకంలో కొరియోగ్రాఫర్గా పనిచేసిన సరోజ్ ఖాన్.. శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి పాప్యులర్ హీరోయిన్లతో అదిరిపోయేలా స్టెప్పులు వేయించారు. దేవదాస్ సినిమాలోని ‘డోలా రే డోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ ‘ఏక్ దో తీన్’, ‘జబ్ వీ మెట్’ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి గాను ఆమె జాతీయ అవార్డులు అందుకున్నారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, రెండు మూడు రోజులు వైద్యుల పరిశీలనలో ఉంచిన అనంతరం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సరోజ్ ఖాన్ చివరిసారి మాధురి దీక్షిత్ నటించిన ‘కలంక్’ సినిమాలోని కొన్ని పాటలకు నృత్య దర్శకత్వం వహించారు. కాగా, ఇక బాలీవుడ్లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో సరోజ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.