ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇప్పుడు భవిష్యత్తు మొత్తం కూడా ఎక్కువగా ఓటీటీ మీదనే ఆధారపడి ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఓటీటీ లో సినిమాలను విడుదల చేయడం ఓటీటీ లోనే ఎక్కువగా సినిమాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చేయడం వంటివి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. ఓటీటీ లో సినిమాలను విడుదల చేయడానికి గానూ చాలా వరకు అగ్ర హీరోల నుంచి హీరోయిన్ ల వరకు అందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. మార్కెట్ ఎక్కువగా ఉంటే మాత్రం అందులోనే సినిమాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 

ఇక తాజాగా హీరోయిన్ లు వరుసగా  ఓటీటీలో సినిమాలో సినిమాలను విడుదల చేయడానికి గానూ ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. తాజాగా కీర్తి సురేష్ ఒక సినిమాను విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు తమన్నా కూడా ఓటీటీ మీద దృష్టి పెట్టింది. అల్లు అరవింద్ మొదలు పెట్టిన ఆహా యాప్ లో ఆమె ఒక టాక్ షో చేయడానికి గానూ డీల్ సెట్ చేసుకుంది అని తెలుస్తుంది. త్వరలోనే ఈ టాక్ షో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. ఆహా కు ఈ మధ్య హీరోయిన్ లు ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. 

 

కీర్తి సురేష్ కూడా ఇప్పుడు ఆహా మీద ఫోకస్ చేసింది. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌స్తుతం తెలుగులో గోపీచంద్‌తో క‌లిసి ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తుంది. మహేష్ బాబు హీరో గా వచ్చే సర్కారు వారి పాట లో కూడా ఆమె నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత తమన్నా తమిళం లో ఒక సినిమా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: