తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో తనదైన నటనతో మెప్పించి గ్లామర్ పరంగానే కాదు యాక్షన్ పరంగా సత్తా చాటింది లేడీ అమితాబ్ విజయశాంతి. కెరీర్ బిగినింగ్ లో స్టార్ హీరోల సరసన నటించిన విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఎక్కువగా నటించింది. నేడు సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఈ రోజు జన్మదిన వేడుక జరుపుకుంటున్నారు. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారు విజయశాంతి. మొదట బీజేపీలో జాయిన్ అయిన ఆమె అప్పట్లో తెలంగాణ పోరాటం సందర్భంగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఆ తర్వాత పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు.
తర్వాత ఎంపీగా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో ఎన్నికల్లోపోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విజయశాంతి చాలా కాలం తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు. దాదాపు పదమూడేళ్ల తర్వాత ఆమె వెండితెరపై కనిపించడంతో ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. నేడు విజయశాంతి పుట్టిన రోజు ఈ సందర్బంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెతలిపారు.
'పుట్టినరోజు శుభాకాంక్షలు విజయశాంతి గారు. మీరు ఎల్లప్పుడు పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను' అని సినీనటుడు మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. 'థ్యాంక్యూ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారు' అంటూ విజయశాంతి రిప్లై ఇచ్చారు.
Thank you super star mahesh babu garu. https://t.co/YGIv5OVhGt
— VijayashanthiOfficial (@vijayashanthi_m) June 24, 2020