టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్, ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా అనంతరం సినిమా షూటింగ్స్ కు పర్మిషన్ లభించడంతో ఈ సినిమా మిగతా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. మెగాస్టార్ ఒక పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

IHG

ఇక మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే తన నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట ను అనౌన్స్ చేయడం జరిగింది. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని 14రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ తో పాటు, తన సొంత బ్యానర్ జీఎంబి ఎంటెర్టైనెంట్స్ తో కలిసి మహేష్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలిసి ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని కనువింధు చేసిన విషయం తెలిసిందే. మొదటి నుండి మహేష్ బాబు సినిమాలను, సక్సెస్ ను మెచ్చుకుంటూ పూల బొకేలు పంపించే అలవాటు మెగాస్టార్ కు ఉంది. అలానే మెగాస్టార్ అంటే మహేష్ కు ఎంతో ప్రత్యేకమైన గౌరవం ఉంది. 

 

కాగా ఈ ఇద్దరు నటులు కలిసి కనుక ఒక సినిమాలో నటిస్తే నిజంగా ఆ సినిమా ఎంతో గొప్ప సక్సెస్ ని అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం అని అంటున్నారు ఘట్టమనేని, మెగా అభిమానులు. వాస్తవానికి చిరంజీవి సినిమాల్లోకి ప్రవేశించిన కొత్తలో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి మూడు సినిమాలు చేసారు. ఆ విధంగా కృష్ణ అంటే చిరంజీవికి మొదటి నుండి మంచి అభిమానం కూడా ఉంది. మరి అటు మెగాస్టార్ ని, ఇటు సూపర్ స్టార్ ని ఇద్దరినీ కలిపి ఒకే సినిమాలో చూపించగల సత్తా ఏ దర్శకుడికి ఉందొ, అది ఎంతవరకు సాధ్యం అవుతుందో రాబోయే రోజుల్లో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: