ఈ సంవత్సరం ప్రారంభంలో వరసగా రెండు హిట్స్ రావడంతో రష్మిక తన పారితోషికాన్ని కూడ బాగా పెంచుకోవాలని ఆశపడింది. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ సినిమాల వల్ల రష్మిక కు వచ్చిన ఆనందం అంతా కరోనా తుడిచిపెట్టేసింది. దీనితో ప్రస్తుతం ఆమె షూటింగ్ లు లేకపోవడంతో తన వద్దకు వచ్చిన దర్శకులు చెపుతున్న కథలు వింటూ కాలం గడుపుతోంది.

 

ఈ నేపథ్యంలోనే నాని హీరోగా నటించవలసిన ‘శ్యామ్ సింగరాయ్‌’ లో హీరోయిన్‌గా రష్మిక కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ కథ విని మరో ఆలోచన లేకుండా రష్మిక వెంటనే నో చెప్పినట్లు సమాచారం. రష్మిక కోరుకునే పారితోషికం ఇస్తామని నిర్మాతలు చెప్పినా ఆమె ఒక్క నిముషం కూడ ఈ విషయమై ఎటువంటి ఆలోచనా చేయలేదని తెలుస్తోంది.


గతంలో నాని రష్మిక తో కలిసి ‘దేవదాసు’ మూవీలో నటించిన నేపధ్యంలో ఆ పరిచయం రీత్యా నాని చెప్పినా రష్మిక సున్నితంగా తిరస్కరించినట్లు టాక్. దీనికి కారణం ఈసినిమాలో మెయిన్ హీరోయిన్ సాయి పల్లవి అయితే ఈకథకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో వచ్చే మరొక హీరోయిన్ పాత్ర రష్మిక ది అని తెలుస్తోంది. తాను మరొక హీరోయిన్ తో కలిసి నటించే సినిమాలు చేయనని తనకు సోలో హీరోయిన్ పాత్ర ఉన్న సినిమాలు మాత్రమే తాను చేస్తానని పరోక్షంగా రష్మిక నానీకి చెప్పినట్లు టాక్.


అయితే ఈ వార్తల పై ఇండస్ట్రీ వర్గాలు వేరుగా కామెంట్స్ చేస్తున్నాయి. సాయి పల్లవి మెయిన్ హీరోయిన్ గా నటించే సినిమాలో తాను నటిస్తే యాక్షన్ లో సాయి పల్లవి డామినేషన్ ముందు తాను తెలిపోతానని భావించి రష్మిక తన గుమ్మంలోకి వచ్చిన కోటిన్నర పారితోషికం ఆఫర్ ను వదులుకుంది అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. వాస్తవానికి సాయి పల్లవితో నటించే సీన్ వచ్చినప్పుడు తాను చాల హోమ్ వర్క్ చేసుకుని షూటింగ్ కు వస్తాను అని శర్వానంద్ ఒక ఫంక్షన్ లో చెప్పినట్లుగా సాయి పల్లవి తో కలిసి నటించాలి అంటే ఆమె స్పీడ్ ముందు ఎవరైనా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు అనడంలో ఎటువంటి సందేహంలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: