కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో జనాలు ఓటీటీ వేదికగా సినిమాల్ని, వెబ్ సిరీస్ లని చూస్తున్నారు. ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఓటీటీ వేదికలకి బాగా అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో ఓటీటీలకి సబ్ స్క్రయిబర్స్ విపరీతంగా పెరిగారు. కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతున్న కారణంగా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో చాలా సినిమాలు, ముఖ్యంగా మినిమమ్ బడ్జెట్ లో రూపొందిన చిత్రాలు ఓటీటీ వేదికగా సందడి చేస్తున్నాయి.

 

అయితే తాజాగా రానా సమర్పణలో తెరకెక్కిన తెలుగు  చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. అడవి శేష్ హీరోగా మిస్సింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో మంచి థ్రిల్ కలుగజేసిన క్షణం సినిమా దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించిన క్రిష్ణ అండ్ హిస్ లీల నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. సాధారణంగా ఇప్పుడు ఓటీటీలో విడుదల అవుతున్న ప్రతీ సినిమాకి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్న సినిమాలని చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది.

 

కానీ క్రిష్ణ అండ్ హిస్ లీల నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుందని అసలు ప్రకటించనే లేదు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదల అవుతుందని చెప్పారే కానీ ఏ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతుందనేది మాత్రం ప్రకటించలేదు. మూడు రోజుల నుండి వరుసగా సినిమా నుండి చిన్న చిన్న టీజర్ లని రిలీజ్ చేస్తూ, ముగ్గురు హీరోయిన్లని పరిచయం చేశారు. నిన్నటికి నిన్న సడెన్ గా నెట్ ఫ్లిక్స్ లో సినిమా వచ్చేసిందని చెప్పారు.

 

సిద్ధి జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ తో పాటు షాలిని, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించారు. కథ, కథనం, సంభాషణల్లో దర్శకుడు రవికాంత్ పేరెపుతో పాటు హీరో సిద్ధు హస్తం కూడా ఉంది. ముగ్గురి హీరోయిన్లతో ఒకేసారి లవ్ లో పడిన హీరో ఎలాంటి కన్ఫ్యూజన్ కి గురయ్యాడనేది కథాంశంగా ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాని చూసినవాళ్ళు పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: