కరోనా కారణంగా నేచురల్ స్టార్ నాని చిత్రమైన వి సినిమా ఇంతవరకూ రిలీజ్ కాలేదు. ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకి రెడీ అయిన తర్వాత కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో రిలీజ్ డేట్ వాయిదా పడింది. అయితే థియేటర్లు తెరుచుకున్నాక రిలీజ్ రెడీగా ఉన్న సినిమాల్లో ప్రథమ స్థానంలో వి ఉంటుంది. నాని మొట్టమొదటి సారిగా నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్న ఈ సినిమాని చూడాలంటే థియేటర్లు ఓపెన్ అయ్యేవరకూ ఆగాల్సిందే.

 

 

అయితే ప్రస్తుతం నాని చేయబోతున్న శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి అనేక వార్తలు వస్తున్నాయి. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయిందని అన్నారు. కానీ ఆ వార్తలని పటాపంచలు చేస్తూ దర్శకుడు రాహుల్ సాంక్రిత్యయాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ ని స్టార్ట్ చేసాడు. అందులో భాగంగానే సినిమాలో నటీనటులని ఎంపిక చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఈ సినిమాలోను ముగ్గురు హీరోయిన్లలో మెయిన్ లీడ్ గా సాయి పల్లవి ఎంపికైందని సమాచారం అందింది.

 

 

ఈ సినిమాలో సాయిపల్లవి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. సెకండ్ హీరోయిన్ గా రష్మిక పేరు వినిపించినప్పటికీ, ఆమె రిజెక్ట్ చేసిందట. ఇక మిగతా ఇద్దరి స్థానాలకి గాను మాళవికా మోహనన్, శోభితా ధూళిపాళ్ళ పేర్లని పరిశీలిస్తున్నారట. మాళవికా మోహనన్ తమిళ నటుడు విజయ్ సినిమా మాస్టర్ లో హీరోయిన్ గా నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లు ఓపెన్ అయ్యాక పలకరించనుంది.

IHG

 

ఇక మూడవ హీరోయిన్ గా గూఢాచారి ఫేమ్ శోభితా ధూళిపాళ్లకి అవకాశం వచ్చిందని అంటున్నారు. శోభితా తెలుగమ్మాయే అయినప్పటికీ హిందీ సినిమాల్లోనే మొదటగా అవకాశం తెచ్చుకుని, ఆ తర్వాత వెబ్ సిరీస్ లలోనూ కనిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: