ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సాయిపల్లవి ఇతర హీరోయిన్లకు చాలా భిన్నంగా నడుచుకుంటుంది. ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేయడానికి ఆమె అస్సలు అంగీకరించదు. గంట సేపు ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ చిత్రీకరణలో పాల్గొన్నందుకు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ ఆమె మాత్రం అందుకు నో చెప్పి అందర్నీ కి పెద్ద షాక్ ఇచ్చింది. అలాగే లక్షల రూపాయలను ఇస్తామని ఎన్నో షాపుల యజమానులు ఆమెను సంప్రదించినప్పటికీ... తాను మాత్రం ఏ నాడు డబ్బుల కోసం ఆశ పడలేదు. 


తనకి సినిమాల్లో నటించడం తప్ప మరే ఇతర ఆశలు లేవని కావాలంటే సినీరంగాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతాను తప్ప ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇష్టం లేని పనులను అస్సలు చేయనని ఎన్నో సందర్భాల్లో సాయి పల్లవి చెప్పుకొచ్చింది. లిప్ కిస్ లో హాట్ సీన్లు ఉన్నాయని బడా స్టార్ల సరసన నటించే అవకాశాలను కూడా వద్దన్న ఏకైక హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత హీరోయిన్ల లో సాయి పల్లవి లాంటి వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్ ని తెలుగు ప్రేక్షకులు కళ్లారా చూడటం బహుశా ఇదే మొట్టమొదటిసారి కావచ్చేమో. అయితే తాజాగా ఆమె కోటిన్నర రూపాయల ఆఫర్ను రిజెక్ట్ చేసి మళ్ళీ అందరినీ విస్తుపోయేలా చేసింది. 


పూర్తి వివరాలు తెలుసుకుంటే ఐటమ్ సాంగ్ లో నాట్యం చేయాలని, చేసినందుకుగాను కోటిన్నర రూపాయలు ఇస్తామని సాయి పల్లవి ని ఓ సినిమా బృందం సంప్రదించిందట. కానీ సాయి పల్లవి మాత్రం ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట. హీరోయిన్ గా తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఐటమ్ సాంగ్స్ లలో అందాలను ఆరబోయడం మంచిది కాదని భావించిన సాయిపల్లవి ఈ కోటిన్నర రూపాయల ఆఫర్ ని రిజెక్టు చేసిందని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె నాగచైతన్య సరసన లవ్ స్టోరీ లో, రానా దగ్గుబాటి సరసన విరాటపర్వం సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: