ఫిదా సినిమా తో టాలీవుడ్ లో మేకర్స్ ని ప్రేక్షకులని ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత సాయి పల్లవికి అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలలో అద్భుతైన అవకాశాలు వచ్చాయి. కాని వాటిలో సాయి పల్లవి చాలా సినిమాలు వదిలేసింది. తను కేవలం శర్వానంద్ తో పడి పడి లేచే మనసు..నాని తో మిడిల్ క్లాస్ అబ్బాయి..తమిళంలో ధనుష్ తో మారి 2 ..ఇలా కొన్ని సెలెక్టెడ్ సినిమాలనే ఒప్పుకుంది. 

 

అంతేకాదు ఎన్నో కమర్షియల్ యాడ్ ఫిలింస్ కూడా సాయి పల్లవి చేతికి వచ్చాయి. కాని యాడ్ ఫిలింస్ తో పాటు మంచి క్రేజీ మూవీ ప్రాజెక్ట్స్ ని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసింది. ఈ విషయంలో ఎంత పట్టుదలగా ఉందంటే సినిమాలకి దాదాపు కోటి పైన ఆఫర్ వచ్చినా నో..కమర్షియల్ యాడ్ ఫిలింస్ కి 2 నుంచి 3 కోట్ల ఆఫర్ వచ్చినా నాట్ ఇంట్రెస్టెడ్ ...అని తెగేసి చెప్పింది.

 

ఇలా చెప్పడానికి సినిమాలలో ఓవర్ ఎక్స్‌ఫోజింగ్ ..లిప్ కిస్ లాంటి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి ఆసక్తి చూపించకపోవడం అలాగే యాడ్ ఫిలింస్ అంటే ఫేక్ అన్న ఒక భావన కలగడం. యాడ్ ఫిలింస్ తో జనాలని మోసం చేయను...డబ్బుకోసం క్యారెక్టర్ చంపుకోను...ఇదే సాయి పల్లవి మైండ్ స్టాటజీ. అందుకే వీటిలో అవకాశాలు వస్తే నాట్ ఇంట్రెస్టెడ్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అంతే.. అని చెప్పేసింది.

 

ఇక సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్యతో కలిసి లవ్ స్టోరీ అన్న సినిమా చేస్తుంది. అలాగే వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా వస్తున్న విరాట పర్వం అన్న సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి ప్రియమణి తో కలిసి నక్సలైట్ పాత్రలో కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలలో సాయి పల్లవి పోస్టర్స్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్..లవ్ స్టోరీ సినిమా టీజర్ తో బాగా ఆకట్టుకుంది. ఖచ్చితంగా మళ్ళీ రెండు హిట్ సినిమాలు సాయి పల్లవి ఖాతాలో పడబోతున్నాయన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: