టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కరోనాకు ముందుగా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో మిగతా షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో బన్నీ, రష్మిక ఇద్దరూ కూడా పక్కా మాస్  పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. 

IHG

ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు రావడం జరిగింది. ఇప్పటికే తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్ గా నటిస్తున్న విజయ్ సేతుపతి, ఈ సినిమా కథ, కథనాలు నచ్చడంతో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆయనకు ప్రస్తుతం టాలీవుడ్ లో మరొక బడా సినిమాలో కూడా అవకాశం వచ్చినట్లు చెప్తున్నారు. అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో మెయిన్ విలన్ గా కన్నడ నటుడు కిచ్చ సుదీప్ నటిస్తున్నట్లు కొన్నాళ్ల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తుండగా, సుదీప్ తో పాటు సినిమాలో మరొక విలన్ పాత్ర కూడా ఉందని, ఆ పాత్ర కోసం యూనిట్ సభ్యులు విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. 

IHG

ఇటీవల ఆయనతో దర్శకుడు పరశురామ్ ప్రత్యేకంగా ఫోన్ లో సంభాషించి సినిమా కథను వినిపించడం జరిగిందని, కాగా కథతో పాటు తన పాత్ర కూడా ఎంతో నచ్చడంతో విజయ్ సేతుపతి కూడా చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. కాగా ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: