మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, రెజీనా కసాండ్ర హీరోయిన్ గా మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. 2015లో దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు హీరో, హీరోయిన్లు ఇద్దరికీ కెరీర్ పరంగా మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది. కొన్ని అనుకోని సమస్యల నిమిత్తం అమెరికా వెళ్లిన ఒక కుర్రాడు, అక్కడి కష్టపడి పని చేస్తూ, ఇండియా లోని తన ఇంటికి ప్రతి నెలా డబ్బులు పంపుతుంటాడు. 

IHG

అదే సమయంలో అక్కడ అక్కడికి వేరొక వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వచ్చిన హీరోయిన్ తారసపడడం జరుగుంది. ఆ తరువాత ఆ పెళ్లి ఆగిపోవడం, ఆమె అనుకోకుండా హీరో ని ప్రేమించడం, వారు ఇండియాకి రావడం, ఆపై కథ కొంత ఆసక్తికరంగా సాగడం జరుగుతుంది. ఈ విధంగా ఆకట్టుకునే కథ, కథనాలతో సాగే ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించగా, సీత పాత్రలో రేజీనా నటించింది. జీవితంలో స్వశక్తి మీద పైకి వచ్చి మంచి స్థాయిలో నిలవాలనే ఆకాంక్షతో సాగె ఆమె పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉంది. 

 

ఇకపోతే సినిమాలో ఆమె పాత్రకు ఒక మంచి ఆకట్టుకునే డైలాగ్ ఉంది. సీతిక్కడ, సీతతో అంత ఈజీ కాదు అంటూ సినిమాలోని పలు సందర్భల్లో ఆమె పలికే ఈ డైలాగ్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. సినిమాలో రెజీ6నా తనదైన ఆకట్టుకునే నటనతో పాటు అలరించే డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఆ విధంగా ప్రేక్షకనాడి పట్టి, సినిమాతో పాటు హీరో, హీరోయిన్లు ఇద్దరికీ మంచి పేరు రావడానికి కారకుడైన దర్శకుడు హరీష్ శంకర్ గురించి అయితే ఎంత చెప్పిన తక్కువే. ఈ సినిమా సక్సెస్ తరువాత రెజీనాకు మంచి అవకాశాలు లభించాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: