ప్రస్తుతం ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వస్తూనే ఉన్నారు. కానీ సినీ పరిశ్రమలో నటులు ఎవరైనా తమకంటూ ఓ గుర్తింపు రావాలని కోరుకుంటారు. ఎలాంటి పాత్ర చేసినా ప్రేక్షకుల మెప్పు పొందితే చాలని భావిస్తారు. అటువంటి ప్రయత్నాల్లో మన నటీనటుల మేనరిజమ్స్ కి అనుగుణంగా చెప్పే క్రేజీ డైలాగ్స్ కూడా ఒకటిగా చెప్పొచ్చు. అందులో మన ఛార్మి పద్దు.. శివంగి.. ఆడపులి’ అంటూ డైలాగ్ తో తనాదైన ముద్ర వేసుకుంది.

 

 

ఇక చార్మీ సినీ కెరీర్ విషయానికి వచ్చేసరికి ఛార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. నీతోడు కావాలి అనే తెలుగు సినిమాలో ఆమెకి నటించే అవకాశం వచ్చింది. అప్పటికి చార్మీ వయసు కేవలం14 సంవత్సరాలు మాత్రమే. 2001లో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 

 

 

ఇక ఆ తర్వాత 2003లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా మళ్ళీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ తరవాత గౌరి, మాస్, చక్రం, అనుకోకుండా ఒక రోజు,లక్ష్మీ, రాఖీ, మంత్ర మొదలగు చిత్రాలలో నటించింది. ముఖ్యంగా మంత్ర సినిమాకి గాను ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే అమెకి సినిమాలలో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయని చెప్పాలి. ఇక టాలీవుడ్ కి కొత్తకొత్త హీరోయిన్స్ వస్తు ఉండడంతో చార్మీ మెల్లిమెల్లిగా ఫెడ్ అవుట్ అయిపొయింది.

 

 

అయితే ఛార్మికి శ్రీ ఆంజనేయం సినిమాతో చాల క్రెజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో పద్దు.. శివంగి.. ఆడపులి’ అంటూ ఛార్మి ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో తన మేనరిజం డైలాగ్ తో ఆకట్టుకుంది. క్లాస్ అమ్మాయి.. మాస్ డైలాగ్ చెప్తుంటే థియేటర్లో ఈలలు, గోలలు. కొత్త హీరోయిన్ భలే చేసిందిరా.. అనుకోని వాళ్ళు ఉండరు ఆ టైంలో. ఈ సినిమా తర్వాత ఛార్మి వరుస ఆఫర్లతో బిజీ అయిపోయి స్టార్ హీరోల సరసన నటించి అగ్రతారగా వెలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: