నాని కెరియర్ లో ఇప్పటివరకు 25 సినిమాలలో నటించినా అతడికి నేచురల్ స్టార్ అన్నగుర్తింపు వచ్చింది కాని ఇంకా అతడు కోరుకుంటున్న మాస్ హీరో ఇమేజ్ ఏర్పడలేదు. ఇలాంటి మాస్ ఇమేజ్ కోసం నాని కొంత కాలం క్రితం ‘కృష్ణార్జున యుద్ధం’ మూవీ ద్వారా ప్రయత్నించినా ఆప్రయత్నం నానీకి చేదు అనుభవాన్ని మాత్రమే మిగిల్చింది.


ఇలాంటి పరిస్థితులలో నానీకి తీరనికోరికను ‘కేజీ ఎఫ్’ సినిమాతో పాపులర్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ తీర్చబోతున్నాడా అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. హీరోయిజమ్ ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ కు ఒక ప్రత్యేకత ఉంది. ‘కేజీ ఎఫ్’ తరువాత అనేకమంది టాలీవుడ్ టాప్ హీరోల దృష్టి కూడ ప్రశాంత్ నీల్ పై పడింది.

 

కొంతకాలం క్రితం ప్రశాంత్ నీల్ ఒకసారి మహేష్ ను మరొకసారి జూనియర్ ను వ్యక్తిగతంగా కలవడంతో ప్రశాంత్ నీల్ తెలుగులో ఈ ఇద్దరి హీరోలలో ఎవరో ఒకరితో సినిమా తీయబోతున్నాడు అంటూ రూమర్స్ వచ్చాయి.   దీనికితోడు మైత్రీ మూవీస్ సంస్థ ప్రశాంత్ నీల్ తో ఒకమూవీ చేయడానికి ఎగ్రిమెంట్ చేసుకుంది అని వార్తలు కూడ రావడంతో ఈదర్శకుడి తొలి తెలుగుసినిమా ఎవరో ఒకరి టాప్ హీరోతో ఖాయం అని అనుకున్నారు అంతా.  

 

ఇటీవలే ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణసంస్థ విషెస్ చెప్తూ ‘గొప్ప మనసు కలిగిన సెన్సేషనల్ డైరెక్టర్ కి శుభాకాంక్షలు. త్వరలో మిమ్మల్ని రేడియేషన్ సూట్ లో కలవబోతున్నాం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేయడంతో ప్రశాంత్ నీల్ తెలుగులో ఎవరితో సినిమా చేయబోతున్నాడు అంటూ ఊహాగానాలు మరింత పెరిగిపోయాయి. ఈపరిస్థితులు ఇలా ఉండగా నానితో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నాడు అంటూ కొత్తగా వార్తలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఈన్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా జూనియర్ మహేష్ లతో సినిమా చేస్తాడు అని భావించిన ప్రశాంత్ నీల్ నానీతో సినిమా చేస్తాడా అంటూ చాలమంది షాక్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: