ఎం ఎం కీరవాణి సంగీతం ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. అతను అందించే సంగీతం ప్రేక్షకుల రోమాలు నిక్క పొడిచేలా ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. చత్రపతి, బాహుబలి, సై, యమదొంగ వంటి చిత్రాలలో తాను అందించిన సంగీతం ప్రేక్షకుల మనసులను నేరుగా తాకిందని చెప్పుకోవచ్చు. 


అయితే ఇప్పటివరకు ఎమ్.ఎమ్.కీరవాణి పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఏనాడు సంగీతం సమకూర్చలేదు. కానీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరుపాక్ష సినిమా లో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా... ఆ సినిమాకి రెండు ప్రత్యేక పాటలను కీరవాణి స్వరపరస్తున్నాడట. పవన్ కళ్యాణ్ కీరవాణి కాంబినేషన్ లో పాటలు రూపొందించుకోవడం ఇదే తొలిసారి కాగా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు ఒక నెల రోజులుగా పవన్ కళ్యాణ్ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడని వార్తలు వెల్లువెత్తాయి కానీ తాజాగా అతడి గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చి పెద్ద దుమారం రేపుతోంది. 


పవన్ కళ్యాణ్ నటిస్తున్న పిరియాడిక్ డ్రామా లోని రెండు పాటలకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడని... ఆ పాటలు కూడా సినిమా మొత్తం లో బ్యాక్ గ్రౌండ్ లో బిట్స్ రూపంలో వినిపిస్తాయని... మొత్తం సినిమాలోని అనేక కీలకమైన సన్నివేశాలని కీరవాణి సంగీతం బాగా ఎలివేట్ చెయ్యనున్నదని తాజాగా సమాచారం అందుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. 


ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం అత్యుత్తమంగా ఉండాలనే ఉద్దేశంతో దర్శకుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఇకపోతే ఎం ఎం కీరవాణి స్వరపరచిన రెండు పాటలు అద్భుతంగా ఉండబోతున్నాయని పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గిన వెంటనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: