రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ పై అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి మరో మారు తెలుగు వీరుల కథని ఆర్.ఆర్.ఆర్ ద్వారా చెప్పడానికి వస్తున్నాడు.

 

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేసిన రాజమౌళి, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ ని మరికొద్ది రోజుల్లో రివీల్ చేయనున్నాడు. తెలుగు రాష్ట్రాలకి చెందిన ఈ ఇద్దరు వీరులు కలుసుకున్నట్లు చరిత్రలో ఆధారాలు లేవు. కానీ వీరిద్దరి జీవితంలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. వాటి ఆధారంగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ కల్పిత కథలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఎలా కలిసారన్నదే ఆసక్తికరమైన అంశం.

 

అయితే వారిద్దరినీ కలపడానికి ఒకానొక పాత్ర సహాయం చేస్తుందిట. ఆ పాత్రలోనే బాలీవుడ్ దిగ్గజం అజయ్ దేవగణ్ నటిస్తున్నాడు. అజయ్ దేవగణ్ పై ఈ పాటికే కొంతమేర చిత్రీకరణ జరిగింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఈ పాత్ర చాలా బలంగా ఉండనుందట. ఇక్కడ అజయ్ దేవగణ్ సరసన సీనియర్ హీరోయిన్ శ్రియ కూడా నటిస్తుంది. అయితే ముందుగా ఈ పాత్ర పరిసధి తక్కువగా ఉందట.

 

కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం అజయ్ దేవగణ్ పాత్ర పరిధి పెంచుతున్నారట. కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులొచ్చాయి. రాజమౌళి ప్లాన్స్ లో కూడా చాలా ఛేంజెస్ అయ్యాయని అంటున్నారు. అజయ్ దేవగణ్ పాత్ర ఇంతకుముందు డిజైన్ చేసిన దానికంటే ఇంకాస్త మెరుగ్గా, ఎక్కువ రన్ టైమ్ ఉండేలా మార్పులు చేయనున్నారట. మరి ఈ  విషయమై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: