తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇలా వచ్చిన సినిమాలు చాలానే మంచి విజయాలు కూడా అందుకుంటూ వుంటాయి. అయితే సినిమాలు విజయం అందుకోవడమే కాదు... కొన్ని సినిమాలోని డైలాగులు కూడా మంచి సక్సెస్ సాధిస్తాయనే చెప్పాలి. కొన్ని డైలాగులు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటాయి. ఇలా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయిన డైలాగ్... హీరోయిన్ సదా చెప్పిన వెళ్లవయ్యా వెళ్ళు వెళ్ళు.. అంటూ చెప్పిన డైలాగ్. ఈ డైలాగ్ ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఒక్క డైలాగ్ తో సదా తెగ ఫేమస్ అయిపోయింది. 

 


 డైనమిక్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నితిన్  హీరోగా తెరకెక్కిన చిత్రం జయం. ఈ సినిమాతో నితిన్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమాలో తనను ప్రేమించాలంటూ హీరోయిన్ సదా వెంటపడుతూ ఉంటాడు నితిన్. ఈ సందర్భంలో నితిన్ ని తన దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పడానికి వెళ్లవయ్యా వెళ్ళు వెళ్ళు అంటూ సద ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో డైలాగ్ చెబుతుంది సదా . ఈ డైలాగ్ అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అని చెప్పాలి . ఈ ఒక్క డైలాగ్ తో సదా ఎంతగానో ఫేమస్ అయిపోయింది. 

 


 నితిన్ సదా కాంబినేషన్లో తెరకెక్కిన జయం సినిమాలో విలన్ పాత్రలో గోపీచంద్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాలోని సదా చెప్పినా ఆ ఒక్క డైలాగు మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ గా మారిపోయింది. అంతేకాదు తెలుగు ప్రేక్షకుల చూపు మొత్తం తన వైపు మళ్లేలా చేసింది సదా. ఇక ఈ సినిమాలో సదా నటనకు అభినయానికి మరిన్ని ఆఫర్లు కూడా వచ్చి సదా చెంత వాలాయి  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: