మామూలుగా హీరోయిన్లు ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఉంటారు. కొన్ని సినిమాల్లో తమ అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటే మరికొన్ని ఈ సినిమాల్లో  తమ  నటనతో ఎంతగానో అలరిస్తూ ఉంటారు. అయితే ఇలా నటనతో అందంతో ఎంత ఆకట్టుకున్నప్పటికీ కొన్ని సినిమాల్లో  మాత్రం ఒక్క డైలాగ్ తో ఫేమస్  అయిపోతుంటారు హీరోయిన్లు. ఆ ఒక్క డైలాగ్ వారికి ఎంతో క్రేజ్ ని తెచ్చి పెడుతూ ఉంటుంది. అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో ఆ డైలాగ్ ట్రెండింగ్ గా మారిపోతూ ఉంటుంది. 

 


 తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా కొన్ని రోజులపాటు ట్రెండింగ్ గా మారిన డైలాగ్... ఏంటో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే... అంటూ హీరోయిన్ అంజలి చెప్పిన డైలాగ్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మల్టీస్టారర్ సినిమాగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫామిలీ బంధాలను బంధుత్వాల విలువలను మరోసారి గుర్తు చేసింది ఈ సినిమా. సినిమాలో  సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది అని చెప్పాలి. 

 


 ఇక ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా అంజలి నటించగా మహేష్ కి జోడీగా సమంత నటించింది. అయితే వెంకటేష్ కి జోడీగా నటించిన అంజలి తన పాత్రలో ఒదిగిపోయిన నటించింది  అనే చెప్పాలి. తనదైన నటనతో ఎంతగానో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అంజలి ఏంటో  నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే అంటూ చెప్పిన డైలాగ్ తెగ ఫేమస్ ఐపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ డైలాగ్ ని తెలుగు ప్రేక్షకులకు ఎన్నో సందర్భాల్లో వాడుకున్నారు కూడా. కొన్ని రోజుల వరకు ఈ డైలాగ్ తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంది. ఈ ఒక్క డైలాగ్ తో అంజలి తెలుగు ప్రేక్షకుల అందరి దృష్టిలో పడింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: