తెలుగు చిత్ర పరిశ్రమలో  కథానాయికలందరూ తమదైన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు... తమ నటనతో కూడా మెప్పిస్తూ ఉంటారు. అయితే చాలామంది స్టార్ హీరోయిన్ లు ఎన్నో సినిమాల్లో నటిస్తున్నప్పటికీ కొన్ని సినిమాల్లో మాత్రం  హీరోయిన్ల మేనరిజం తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటుంది. ఆయా సినిమాల్లో హీరోయిన్లు చెప్పిన డైలాగులు ప్రేక్షకులకు మదిలో నిలిచిపోతూ వుంటాయి. ఆ ఒక్క డైలాగ్ తో మరింత ఫేమస్ అయిపోతుంటారు హీరోయిన్లు. 

 


 ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ఒక్క డైలాగ్ తో తెగ క్రేజ్ సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరిలో ఒకరు రష్మిక మందన. ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన రష్మిక మందన బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఎక్కడ అందాల ఆరబోత చేయకుండానే ఈ అమ్మడు ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం తన చిలిపి నవ్వుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది రష్మిక మందన. 

 


 అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా లో రష్మిక మందన్న మేనరిజం తెలుగు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయి పోయింది అన్న విషయం తెలిసిందే. ఒక మంచి బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న రష్మిక మందన... ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్  కుర్రాడిని చూపించవయ్యా... నీకర్థమవుతుందా... అంటూ చెప్పిన డైలాగ్ తెగ ఫేమస్ అయిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా చూసిన తరువాత ఎంతో మంది ప్రేక్షకులు కూడా ఏదో ఒక సన్నివేశంలో ఈ డైలాగ్ వాడుతూ నే ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ని ఈ డైలాగ్  కొన్ని రోజుల పాటు ట్రెండింగ్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: