కీర్తి సురేష్ సినిమాలకు ఈ మధ్య మంచి ఫాలోయింగ్ అనేది వచ్చింది. కీర్తి సురేష్ తో సినిమా చేస్తే హీరో ఉన్నా లేకపోయినా సరే మంచి పాత్ర ఆమెకు ఇస్తే చాలు కచ్చితంగా సినిమాకు మంచి ఆదరణ అనేది వస్తుంది అని భావిస్తున్నారు. ఓటీటీ లో సినిమాలను ఆమె విడుదల చేయడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఓటీటీ లో సినిమాలను విడుదల చేస్తే ఆమె వరకు మాత్రం మంచి లాభాలు అనేవి వస్తున్నాయి. ఇక అందుకే ఆమె కూడా వెనక్కు తగ్గడం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. 

 

ఇదే రాజమౌళి ని బాగా ఆకట్టుకుంది అని అంటున్నారు. ఓటీటీ లో ఆమె సినిమాలను విడుదల చేయడమే రాజమౌళి ని కట్టిపడేసింది అని అంటున్నారు. ఆయన ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక సినిమాను ఆమెతో దర్శక నిర్మాణ సారధ్యం లో ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నారు అని ఇది త్వరలోనే ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆరు కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో ఒక సినిమాను చేసే ఆలోచనలో ఉన్నారు అని టాక్. సత్య దేవ్ ని హీరో గా పెట్టి ఒక గంట సినిమా ప్లాన్ చేస్తున్నారట. 

 

చూడాలి మరి ఈ సినిమా ఆయన చేస్తారా లేదా అనేది. ఇప్పుడు ఆయన ఆర్అరఆర్ సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఈ సినిమాలో ఆయన ఏ విధంగా హీరో  హీరోయిన్ లను చూపిస్తారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆయన లాక్ డౌన్ లో ఖాళీ గా ఉండగా హీరోలు కూడా లాక్ డౌన్ లో భవిష్యత్తు ప్లన్స్ వేస్తున్నారు. చూడాలి ఆర్ఆర్ఆర్ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: