మన తెలుగులో అయినా బాలీవుడ్ లో అయినా సరే రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సరే సంచలనమే. అతని సినిమాలు అనగానే జనాలకు ఒక తెలియని ఆసక్తి అనేది వచ్చేస్తుంది. సినిమా ఏ విధంగా ఉన్నా సరే చూసే వాళ్ళు కొందరు ఉంటే అసలు ఆయన సినిమా అనగానే ఒకటికి పది సార్లు ఆలోచన చేసి హాల్ కి వెళ్ళే వాళ్ళు గాని ఓటీటీ లో సినిమా చూసే వాళ్ళు గానీ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు వర్మ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ఏ కథ తో సినిమా చెయ్యాలి అంటే ఆ కథ తో వరుసగా సినిమాలు చేస్తున్నారు. 

 

అది హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే సినిమాలను ఆ విధంగా చేస్తున్నారు. అందులో ఏ మాత్రం రాజీ పడటం లేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వర్మ సినిమాల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి హాల్ లో ఏ సినిమా కూడా వద్దు అని భావిస్తున్నట్టు టాక్. అన్నీ కూడా ఓటీటీ లోనే విడుదల చెయ్యాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే అతను సినిమాలు చేయడానికి గానూ ఓటీటీ సంస్థలతో  ఒప్పందం కూడా చేసుకున్నారు అని టాక్. ఆయా సంస్థలు కూడా ఆయన తో అదే విధంగా సినిమాలు చెయ్యాలి అని రెడీ అయ్యాయి. 

 

హాల్ లో సినిమా వచ్చి అది రెండు మూడు రోజులు మాత్రమే ఉండటం కంటే ఓటీటీ లో విడుదల చేయడమే మంచిది అనే భావన లో ఉన్నారు అని సమాచారం. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు వర్మ రెండు సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు లాక్ డౌన్ ఉన్నా ఆగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: