తనకు ఏ రేంజ్ లో మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే రానా మాత్రం ఎప్పుడు కూడా కొత్తగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని సినిమాలు చూసిన ఎవరికి అయినా సరే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అగ్ర హీరో గా అతనికి ఇమేజ్ ఉన్నా సరే అతనికి కమర్షియల్ సినిమాలు వచ్చినా సరే అతను మాత్రం చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అనే చెప్పాలి. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కరోనా సమయంలో కొందరు విద్యార్ధులు చాలా బాధలు పడుతున్నారు. 

 

ఇంట్లో ఉండి చదవలేక పడే బాధలు అన్నీ ఇన్నీ కావు అనే చెప్పాలి. చాలా మంది విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులు ఏ మాత్రం కూడా ఇప్పుడు అసలు అర్ధం కావడం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆ కథ తో విద్యార్ధుల సమస్యలను చెప్పడానికి గానూ అతను మహేష్ బాబు కుమార్తె తో ఒక సినిమా ప్లాన్ చేసాడు అని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు కుమార్తె సితారాను మూడో తరగతి విద్యార్ధిగా చూపించాలి అని భావిస్తున్నాడు. ఆమె ఆన్లైన్ క్లాసులు అర్ధం కాక ఏ స్థాయిలో బాధ పడుతుంది అనేది అతను చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. 

 

మరి అది ఎంత వరకు ఫలిస్తుంది ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా తర్వాత అతను ఒక సినిమాను ఒక మ్మాయి జీవిత కథ ఆధారంగా చేసే ఆలోచనలో ఉన్నాడు అనే టాక్ వినపడుతుంది. మరి ఏమవుతుంది ఏంటీ అనేది చూడాలి. ఇప్పుడు బాబు ఎక్కువగా పెళ్లి గోలలో ఉన్నాడు. ఇది అయిన తర్వాతే అతను నిర్ణయం తీసుకుంటాడు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: