దేశంలో ఫిబ్రవరి నెల నుంచి కరోనా కేసులు పెరిగిపోయాయి.  దాంతో దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ కష్టాల పాలైంది.. ముఖ్యంగా షూటింగ్స్ లో పాల్గొనే సినీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.  ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చారు.. మొదట ఆయన కోటి రూపాయలు విరాళం ఇచ్చి.. కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ప్రారంభించారు. అప్పటి నుంచి సినీ, ఇతర రంగాలకు చెందిన వారు విరాళాలు ఇస్తూ వచ్చారు. వాటితో సినీ కార్మికులకు చేయూత ఇస్తున్నారు మెగాస్టార్.

 

ఈ చారిటీకి సినీ పరిశ్రమకు చెందిన ఎందరో తమ వంతు విరాళాలను అందజేశారు. తద్వారా ఈ చారిటీ ద్వారా సినీ కార్మికులను ఆదుకున్నారు. ఈ నేపథ్యంలో నటి హేమ మాట్లాడుతూ... సినీ నటులు, కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. సీసీసీకి సాయం చేసేందుకు బాలకృష్ణతో పాటు పలువురు హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ముందుకు వచ్చారని... అందరికి ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు.

 

హైదరాబాదులో ఉన్న నటులు, కార్మికులకే కాకుండా విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఉన్న వారందరికి ఒక ప్రణాళికాబద్ధంగా వస్తువులను పంపించడం చాలా గొప్ప విషయమని చెప్పారు. అయితే ఇప్పటి వరకు సీసీసీ ద్వారా చేసిన తొలి విడత సాయంలో 12 వేల మందికి అత్యవసర వస్తువులను అందించామని చెప్పారు. ఇప్పుడు రెండో విడత సాయం ప్రారంభమైందని తెలిపారు.  ఇలా సినీ కార్మికులకు చేయూత ఇవ్వడంతో వారి కళ్లలో సంతోషాన్ని చూస్తున్నామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: