భరత్ అను నేను సినిమా ద్వారా టాలీవుడ్ లో పాపులర్ అయింది కైరా అద్వాని. ఆ సినిమాలో ఆమె నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా ఆమెకు నటిగానే కాకుండా కమర్షియల్ హీరోయిన్ గా కూడా చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది అనే విషయం అందరికి తెలిసిందే. ఇక అక్కడి నుంచి ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో ఆమెకు చాలానే ఆఫర్లు వస్తున్నాయి. అక్కడి స్టార్ హీరోలతో ఆమెకు ఉన్న పరిచయాలు ఆమెకు చాలా బాగా కలిసి వస్తున్నాయి. అగ్ర హీరోలతోనే ఎక్కువగా సినిమాలు ఓకే చేస్తుంది. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె ఒక భారీ ప్రాజెక్ట్ ని తెలుగు లో చేయడానికి అవకాశం వచ్చినా సరే ఆమె మాత్రం వద్దు అని చెప్పింది అని టాక్. ఆమె తెలుగు లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదుఅని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమె మాత్రం అసలు తెలుగు లో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడటం లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఆమె రెండు సినిమాలు బాలీవుడ్ లోనే చేస్తుంది గాని తెలుగు లో ఆఫర్లు వచ్చినా సరే అసలు ఏ మాత్రం కూడా చేయడానికి మొగ్గు చూపించడం లేదట. 

 

ఇప్పుడు ఆమె చేతిలో ఒక సినిమా ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఈ సినిమా తర్వాత తెలుగు లో గుడ్ బై చెప్పాలి అని ఇక్కడ అసినిమాలు చేసినా సరే హీరోలకు గుర్తింపు వస్తుంది గాని హీరోయిన్ లకు వచ్చే అవకాశం లేదు అని ఆమె భావిస్తుంది అని టాక్. చూడాలి మరి ఆమె చేస్తుందా లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: