ఇప్పుడు మన తెలుగు లో సర్కారు వారి పాట సినిమా కోసం జనాలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా కథ నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అనే చెప్పాలి. ఈ సినిమా విడుదల నుంచి షూట్ మొదలు వరకు ప్రతీ ఒక్కటి కూడా ఆసక్తికరంగా ఉన్నాయి ఇప్పుడు అనేది వాస్తవం. అగ్ర హీరో సినిమా కావడం తో అటు తమిళ సిని జనాలు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అని టాక్ వినపడుతుంది. 

 

మహేష్ బాబు కి ఇప్పుడు తమిళ్ లో కూడా క్రేజ్ అనేది పెరుగుతూ వస్తుంది. దీనితో మహేష్ కూడా కాస్త జాగ్రత్తగా సినిమాలను చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు ఒక నిర్ణయం తీసుకున్నాడు అని సమాచారం. ఒక భూమి వేలం ఆధారంగా ఈ సినిమా ఉంటుంది అని సమాచారం. ఆ భూమి వేలం తమిళనాడు లో ఉంటుంది అని తమిళనాడు ఆంధ్రా సరిహద్దు ల్లో ఉండే విధంగా తీస్తారు అనే ప్రచారం మాత్రం టాలీవుడ్ లో బాగానే జరుగుతుంది. అక్కడి కథ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది అని సమాచారం. 

 

త్వరలోనే దీనికి సంబంధించి తమిళ నటులను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి మరి. నిజమా కాదా అనేది తెలియాలి అంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా తర్వాత  మహేష్ బాబు ఏ సినిమా చేస్తాడు అనేది ఇంకా స్పష్టత  లేదు. వచ్చే ఏడాది మొత్తం అతను ఖాళీ గా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: