ఆచార్య సినిమా కోసం ఇప్పుడు టాలీవుడ్ లో జనాలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి సినిమా అనగానే ఏదోక రేంజ్ లో క్రేజ్ అనేది ఉంటుంది. సినిమా కథ నుంచి టైటిల్ వరకు ప్రతీ ఒక్కటి కూడా జనాలకు ఆసక్తి అనేది సినిమా మీద ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. చిరంజీవి సినిమా విడుదల అవుతుంది అంటే చాలు పనులు మానుకుని కూడా జనాలు ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది అనే చెప్పాలి. ఇప్పుడు మన తెలుగు లో చిరంజీవి సీనియర్ హీరోల్లో బాగా డిమాండ్ ఉన్న హీరో అనే సంగతి తెలిసిందే. 

 

ఆయన  సినిమా అంటే జనాలకు ఒక రేంజ్ లో పండగ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. అవును ఈ సినిమా విడుదల విషయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వరకు షూటింగ్ వద్దు అని మరో ప్రాజెక్ట్ ని మొదలు పెట్టే ఆలోచనలో ఆయన ఉన్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

 మరో ప్రాజెక్ట్ ని తీసుకుని వచ్చి దానిని మొదలు పెట్టి ముందుకు వెళ్ళాలి అని చిరంజీవి భావిస్తున్నట్టు టాక్. ఇప్పుడు చిరంజీవి రెండు మూడు సినిమాలను ఆలోచిస్తున్నారు. మరి వీటిలో ఏ సినిమా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ఆయన రెండేళ్ళ వరకు కూడా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొనే అవకాశాలు దాదాపుగా లేవు అని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాలి మరి. చూద్దాం...

మరింత సమాచారం తెలుసుకోండి: