తెలుగు తమిళం లో ప్రియమణి కి ఒకప్పుడు ఉన్న క్రేజ్ అండ్ రేంజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డ్ ను సాధించింది ప్రియమణి. జగపతి బాబు నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాతో టాలీవుడ్ లో దర్శక ధీరుడు రాజమౌళి, పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సూపర్ హిట్ సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది.

IHG

 

అయితే పెళ్ళి చేసుకొని సినిమాలకి దూరంగా ఉన్న ప్రియమణి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తున్న రెండు సినిమాలు దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో చేస్తుంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ రీమేక్ లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నారప్ప టైటిల్ తో తెలుగులో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. సురేష్ బాబు నిర్మిస్తున్నారు.

 

IHG

అలాగే సురేష్ బాబు తనయుడు రానా దగ్గుబాటి హీరోగా విరాటపర్వం తెరకెక్కుతుంది. ఈ సినిమాలోను ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాలో ప్రియమణి నక్సలైట్ గా నటిస్తుంది. ఇక రీసెంట్ గా ప్రియమణికి బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమాలోను అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ రకంగా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉందని అనుకునే లోపే కరోనా దెబ్బకొడుతుందేమో అన్న సందేహాలు ఫ్యాన్స్ లో కలుగుతున్నాయట. 

 

IHG

తను సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సస్ అవడానికి ఎంతగానో తాపత్రయపడుతుంటే కరోనాతో నెలకొన్న పరిస్థితులు మాత్రం అందుకు అడ్డుపడుతున్నాయి. ప్రియమణి నటిస్తున్న నారప్ప, విరాట పర్వం ఎప్పుడు కంప్లీటవుతాయో ..ఎప్పుడు రిలీజ్ అవుతాయో అర్థం కాని పరిస్థితి. అయితే ప్రియమణి మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ మీద చాలా నమ్మకంగా ఉందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: