యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యువి క్రియేషన్స్ కాంబినేషన్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ప్రభాస్ చిన్నప్ప్పటి స్నేహితులు వంశీ, ప్రమోద్ లు కలిసి ఏర్పరచిన ఈ సంస్థ ప్రభాస్ సినిమా అంటే చాలు ఏమాత్రం ఖర్చుకి వెనుకడుగు వేయదు. ప్రభాస్ తో ఇప్పటికే 200 కోట్ల పైన బడ్జెట్ తో సాహో సినిమా తీసి తమ సత్తా చాటారు. ఇక ఇప్పుడు రాధే శ్యాం (వర్కింగ్ టైటిల్) సినిమాకు అసలు లెక్క చేయకుండా ఖర్చు పెడుతున్నారు. జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే మిగతా భాగం ఫారిన్ లో షూటింగ్ చేయాల్సి ఉంది.

 

ఆస్ట్రేలియా, జార్జియా, యూరప్ లోని మరికొన్ని ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరగాల్సి ఉంది. కాని ప్రస్తుతం అక్కడకు వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితి కనబడటం లేదు అందుకే హైదరాబాద్ లోనే సెట్ వేసి ఆ షూటింగ్ జరపాలని నిర్ణయించారు. లాక్ డౌన్ ముందు వరకు కూడా ప్రభాస్ ఇటలీలో షూటింగ్ జరుపుకున్నారు. అయితే సడెన్ గా కరోనా రావడం అంతా లాక్ డౌన్ చేయడంతో షూటింగ్ ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఆ సెట్ ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసి షూటింగ్ చేయాలని అనుకుంటున్నారు.

 

దీనికోసం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయ్యేలా ఉంది. అయినా సరే యువి క్రియేషన్స్ వారు ఎక్కడ వెనుకడుగు వేయట్లేదు. 150 కోట్ల బడ్జెట్ తో అనుకున్న ఈ సినిమా కాస్త మరో 100 కోట్లు అయ్యేలా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రభాస్ సినిమా అంటే నేషనల్ వైడ్ రిలీజ్ ఉంటుంది. సో మార్కెట్ కు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ప్రభాస్, పూజా హెగ్దెల రొమాన్స్ పీక్స్ లో ఉంటుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: