టాలీవుడ్ లో వెబ్ సీరీస్ ల హవా ఓ రేంజ్ లో నడుస్తుంది. కరోనా ప్రభావం వల్ల అందరు ఓటిటి ఫ్లాట్ ఫాం ల మీద పడ్డారు. వారానికో సినిమా చూసే మూవీ లవర్స్ సినిమాలు మిస్ అవడంతో ఓటిటిల్లో వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ లను ఎంజాయ్ చేస్తున్నారు. అప్కమింగ్ టాలెంట్ పీపుల్స్ మాత్రమే కాదు స్టార్ డైరక్టర్స్ కూడా ఈ వెబ్ సీరీస్ ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నరంటే  నమ్మాల్సిందే. ఇప్పటికే టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ క్రిష్ వెబ్ సీరీస్ లను నిర్మిస్తునారు. ఈయన దారిలోనే హరీష్ శంకర్ కూడా వెబ్ సీరీస్ చేసే ఆలోచనలో ఉన్నారు.

 

ఈమధ్యనే యువి వాళ్లతో కలిసి పూరి కూడా వెబ్ సీరీస్ కాంట్రాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే లేటెస్ట్ గా సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి కూడా వెబ్ సీరీస్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి తీస్తే సినిమాలు చేస్తాడు కాని అతనికి వెబ్ సీరీస్ డైరెక్ట్ చేసే టైం ఉంటుందా అనుకోవచ్చు. తన మార్క్ కామెడీ స్క్రిప్ట్ తో ఓ క్రేజీ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నాడట అనీల్ రావిపుడి. సినిమా అంటే అదో పెద్ద వ్యవహారం అదే వెబ్ సీరీస్ అయితే అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయొచ్చు.

 

పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు ప్రతి సినిమాలో కామెడీని బాగా హైలెట్ చేస్తూ అలరించిన డైరక్టర్ అనీల్ రావిపుడి అదే కామెడీతో వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నాడట. దీనికోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడని అంటున్నారు. మరి ఈ వెబ్ సీరీస్ ను తను డైరెక్ట్ చేస్తాడా లేక తను నిర్మించి వేరే వాళ్లతో డైరెక్ట్ చేయిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: