టాలీవుడ్ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం అయిన రవితేజ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటించాడు.  కృష్ణ వంశి తెరకెక్కించిన సింధూరం మూవీతో మంచి పేరు తెచ్చుకున్కాడు. పూరి దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ మూవీతో హీరోగా మారాడు.  మొదటి నుంచి తనదైన మాస్ మేనరీజంతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.  వరుస విజయాలతో దుమ్మురేపాడు. కానీ కిక్ 2 , బెంగాల్ టైగర్ వరుస అపజయాలతో దెబ్బతిన్నాడు.  రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ తో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి.  దాంతో ఇప్పుడు గతంలో తనకు సూపర్ హిట్ ఇచ్చిన బలుపు డైరెక్టర్ గోపిచంద్ మలినేని తో ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నాడు.

IHG

ఇది రవితేజకు మంచి సెంటిమెంట్ అని భావిస్తున్నారు.   ఈ మూవీలో ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.  ప్రస్తుతం పవణ్‌కల్యాణ్‌, నాని, రామ్‌చరణ్‌, కళ్యాణ్‌రామ్‌, మహేష్‌బాబు, విజయ్‌ దేవరకొండ లాంటి వారు సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్ రాజా కూడా వీరి బాటలో నడవబోతున్నట్లు సమాచారం. సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌ను ఏర్పటు చేస్తున్నారనే వార్తులు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

IHG

ఒక బ్యానర్‌ను ఏర్పాటుచేసి తాను హీరోగానే కాకుండా కొత్త కాన్సెప్ట్‌లతో వేరే హీరోలతో కూడా సినిమాలు నిర్మించాలని రవితేజ చూస్తున్నారట. ఈ విషయమై సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక రానా కాంబినేషన్‌లో సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మళయాళంలో బ్లాక్‌బ్లాస్టర్‌ హిట్‌గా నిలిచిన అయ్యపనుమ్‌ కొషియుమ్‌ ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమా దర్శకత్వం బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే అంశంపై డైలామా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: