రెండు మూడేళ్ళు సినిమాలకు దూరంగా ఉండాలని అగ్ర హీరోలు భావిస్తున్నారా...? ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేసి కొత్త ప్రాజెక్ట్ లు వద్దు అనే ఆలోచనలో సీనియర్ హీరోలు ఉన్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. బాలకృష్ణ చిరంజీవి నాగార్జున... వెంకటేష్ ఈ నలుగురు కూడా ఇప్పుడు సినిమాలకు చాలా దూరంగా ఉండే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం టాలీవుడ్ లో జరుగుతుంది. ఈ నలుగురు కూడా ఇప్పుడు షూటింగ్ ల విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచన చేసే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. 

 

అగ్ర హీరోలు గా ఉండి కూడా ఇప్పుడు స్వేచ్చగా సినిమాలను చేయలేని  పరిస్థితి లో వారు ఉన్నారు  అని అర్ధమవుతుంది. ఇప్పుడు ఒక వార్త ఆధారంగా చూస్తే టాలీవుడ్ లో కరోనా వైరస్ ని దృష్టి లో పెట్టుకుని సీనియర్ హీరోలు ఇప్పుడు ప్రాజెక్ట్ లను పూర్తి చేసి ఇక రెండు మూడేళ్ళ వరకు కూడా కొత్త ప్రాజెక్ట్ లను వద్దు అనే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. సినిమాలో తమకు కమర్షియల్ గుర్తింపు లేదు. వాళ్ళ సినిమాలు వంద కోట్ల వసూళ్లు రావడం అనేది చాలా కష్టం అనే సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు ఎక్కువగా సినిమాలను ఓకే చేసి అవి హిట్ కాకపోతే అనవసరంగా బాధ పడి దానికి తోడు ఎప్పుడు చేస్తారో ఎప్పుడు చేయరో తెలియని షూటింగ్ లో ఇబ్బంది పడి ముందుకు వెళ్ళాలి అంటే కాస్త కష్టంగానే ఉంది పరిస్థితి అని టాలీవుడ్ లో టాక్. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుని కాస్త వెనక్కు తగ్గారు అని సమాచారం. అగ్ర హీరోలు ఎవరూ కూడా అసలు కొత్త ప్రాజెక్ట్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అని సమాచారం. మరి ఈ పరిస్థితి ఎన్ని రోజులో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: