సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. మహేష్ కెరీర్ లో తెరకెక్కుతున్న ఈ 27 వ సినిమాని పరశురాం తెరకెక్కిస్తున్నాడు. ఆర్ధిక నేరస్థుడుగా మహేష్ బాబు ఈ సినిమాలో నటిస్తున్నాడని.. బ్యాంక్ వ్యవస్థలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం.  జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు.

 

IHG

ఇక సర్కారు వారి పాట ను చిత్ర యూనిట్ ఆగస్టు నుంచి సెట్స్ మీదకి తీసుకు వెళేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో పెద్ద బ్యాంక్ సెట్ ని నిర్మిస్తున్నారట చిత్ర బృందం. ఈ సెట్ లోనే కొన్ని కీలక సన్ని వేశాలను యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తారట.

 

IHG

ఈ సినిమాలో విలన్ గా అరవింద స్వామి నటించబోతున్నాడని సమాచారం. ధృవ లో అద్భుతమైన నటనతో రాం చరణ్ కి గట్టి పోటీ ఇచ్చిన అరవింద స్వామి అయితే మహేష్ కి ఆపోజిట్ గా పర్ఫెక్ట్ విలన్ అని సెలెక్ట్ చేసుకున్నారట. ఇక రెమ్యూనరేషన్ కూడా భారీగా ముట్టజెపుతున్నారని తెలుస్తుంది. వాస్తవంగా అరవింద స్వామి కి ధృవ తర్వాత స్టార్స్ సినిమాలలో చాలా ఆఫర్స్ ఇచ్చారు మన మేకర్స్.

 

IHG

కాని రెమ్యూనరేషన్ భారీ గా అడగడంతో అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేక దర్శక నిర్మాతలు అరవింద స్వామిని వద్దనుకున్నారు. కాని పరశురాం మాత్రం ఖచ్చితంగా ఆయనే విలన్ గా కావాలని పట్టు పట్టడంతో ఫైనల్ చేశారట. ఇక కీర్తి సురేష్ హీరోయిన్ అని ప్రచారం జరుగుతున్నప్పటికి ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ లేదు. అయితే తాజాగా సర్కారు వారి పాట లో ఇద్దరు హీరోయిన్స్ అని ప్రచారం మొదలైంది. అయితే ఇద్దరు హీరోయిన్స్ అన్న మాట వాస్తవమే అయినా ఆ ఇద్దరు ఎవరన్నది మాత్రం తేలలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: